News January 6, 2025

బిచ్చగాళ్లను పట్టిస్తే రూ.వెయ్యి నజరానా

image

ఇండోర్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో యాచకులను పట్టిస్తే రూ.వెయ్యి బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా యంత్రాంగానికి వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. యాచకుల సమాచారం అందించినవారికి కలెక్టర్ ఆశీష్ సింగ్ రూ.వెయ్యి నజరానా అందించారు. మరోవైపు సర్కార్ కూడా స్వచ్ఛందంగా యాచకులను రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలిస్తోంది.

Similar News

News November 19, 2025

ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

image

దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.

News November 19, 2025

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>HLL<<>> లైఫ్‌కేర్ లిమిటెడ్‌ ఆఫీసర్ ఆపరేషన్స్ పోస్టుల భర్తీ చేస్తోంది. డీ ఫార్మసీ,/బీ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com/

News November 19, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.