News September 10, 2024
తిన్న వెంటనే ఈ పనులు చేస్తే ముప్పు తప్పదు!

భోజనం చేశాక కొన్ని పనులు చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత:
స్నానం చేయొద్దు. శరీరంలో ఉష్ణోగ్రత మార్పు అరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ నీరు తాగొద్దు. దీని వలన ఒంట్లో టాక్సిన్లు పెరుగుతాయి. కాఫీ, టీ తాగొద్దు. వీటిలోని కొన్ని ఆమ్లాలు, ఆహారంలోని బలాన్ని తీసుకోనివ్వకుండా అడ్డుపడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోవద్దు. డయాబెటిస్, ఊబకాయం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.
Similar News
News December 2, 2025
తిరిగి విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్

వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆర్డర్స్ తీసుకున్న ఆయన సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో తిరిగి విధుల్లో చేరనున్నట్లు ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News December 2, 2025
ఇవి వాడితే పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

సాగులో ప్రకృతి వైపరీత్యాల కంటే చీడపీడలతోనే ఎక్కువ నష్టం జరుగుతోంది. ఈ సమస్య నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. దీంతో పురుగు మందుల వినియోగం తగ్గి, పర్యావరణానికి, మిత్రపురుగులకు మేలు జరుగుతోంది. ఏ పంటకు ఏ పరికరం వాడితే లాభమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 2, 2025
iBOMMA రవిపై మరో 3 కేసులు, 14 రోజుల రిమాండ్

iBOMMA రవిని పోలీసులు మరో 3 కేసుల్లో అరెస్టు చేశారు. మంచు విష్ణు, దిల్ రాజు, తండేల్ మూవీ పైరసీ పట్ల మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికే జైల్లో ఉన్న అతడికి నాంపల్లి కోర్టు మరో 14 రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ విధించింది. రవికి బెయిల్ మంజూరు చేయవద్దని, విదేశాలకు వెళ్లిపోయి ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.


