News September 28, 2024

భోజనం చేశాక ఇలా చేస్తే..

image

భోజనం చేశాక 10 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. పేగుల్లో కదలికలు జరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుందని.. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయులు తగ్గేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే తిన్న వెంటనే కాకుండా 5-10 నిమిషాల తర్వాత నడవాలని సూచిస్తున్నారు.

Similar News

News November 22, 2025

Al Falah: వందల మంది విద్యార్థుల భవిష్యత్తేంటి?

image

ఢిల్లీ పేలుడు <<18325633>>ఉగ్ర మూలాలు<<>> అల్ ఫలాహ్ వర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వందల మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వర్సిటీ, కాలేజీల గుర్తింపులు రద్దయితే అంతా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కెరీర్, NEET కష్టం, ₹లక్షల ఫీజులు వృథా అవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఎక్కడా నమ్మరని బాధపడుతున్నారు.

News November 22, 2025

సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

image

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్‌లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్‌‌లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?

News November 22, 2025

అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

image

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.