News November 25, 2024
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల/కొబ్బరి/ఆవ/బాదం నూనెతో మసాజ్ చేస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోకి శక్తి ప్రవహించి వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. నాడులు ఉత్తేజితమై మరుసటి రోజు ఉత్సాహంగా పని చేస్తారు. బాడీ రిలాక్స్ అయి వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అలాగే పాదాలకు ఇన్ఫెక్షన్లు రావు. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
Similar News
News January 7, 2026
శని ప్రభావంతో వివాహం ఆలస్యం

జాతక చక్రంలో వివాహ స్థానంపై శని ప్రభావం ఉంటే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. శని మందగమన గ్రహం కావడంతో ప్రతి విషయంలోనూ జాప్యం జరుగుతుంది. దీనికి పరిష్కారంగా ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేయాలి. ‘శని గవచం’ పఠించడం, పేదలకు ఆహారం లేదా వస్త్ర దానం చేయడం వల్ల శని ప్రసన్నుడవుతాడు. ముఖ్యంగా హనుమంతుడిని పూజించడం వల్ల శని దోషాలు తొలగి, వివాహ మార్గం సుగమం అవుతుంది.
News January 7, 2026
NIT వరంగల్లో JRF పోస్టులు

<
News January 7, 2026
టమాటా దిగుబడి ఎక్కువైతే అక్కడి రైతులు ఏం చేస్తారంటే?

మన దగ్గర టమాటా దిగుబడి ఎక్కువై, సరైన గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆగ్రహంతో, బాధతో పంటను రోడ్ల పక్కన పడేయడం చూస్తుంటాం. ఇటలీ, చైనా వంటి దేశాల్లో మాత్రం టమాటాలకు ధర లేకుంటే వాటిని నీటితో శుభ్రపరిచి, రెండుగా కోసి ఎండ తీవ్రంగా ఉన్నచోట ఆరబెడతారు. అవి రుచి కోల్పోకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఆ ముక్కలపై ఉప్పు చల్లుతారు. అవి బాగా ఎండిపోయాక, ప్యాకింగ్ చేసి మార్కెట్లలో అమ్మి ఆదాయాన్ని పొందుతారు.


