News October 30, 2024
రోజూ ఉదయాన్నే ఇలా 15 నిమిషాలు చేస్తే..

రోజూ ఉదయాన్నే 15-30 నిమిషాల ప్రాణాయామంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందుగా సుఖాసనం/వజ్రాసనంలో నిటారుగా కూర్చోవాలి. కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కిపట్టి ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని నొక్కి కుడి రంధ్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండువైపులా చేయాలి. దీనివల్ల ఒత్తిడి, హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగై గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
Similar News
News November 18, 2025
గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.
News November 18, 2025
గుండెలను పిండేసే ఘటన.. 3 తరాలు బూడిద

సౌదీ బస్సు ప్రమాదంలో HYDకు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో <<18312045>>18<<>> మంది మరణించడంతో అతడి తల్లి రోషన్ గుండెలు బాదుకుంటున్నారు. చివరి చూపులకూ నోచుకోలేకపోతున్నామని, అల్లా ఎంత పని చేశాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబంలోని 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు మరణించారు. నసీర్ పెద్దకుమారుడు సిరాజుద్దీన్ USలో ఉండటంతో ప్రాణాలతో మిగిలాడు. ఆ కుటుంబంలో 3 తరాలు బూడిదైపోయాయి.
News November 18, 2025
దేశంలో పెరిగిన ‘గర్భనిరోధకం’

గర్భనిరోధక మాత్రల వాడకంలో US, చైనా తర్వాత భారత్ నిలిచింది. దేశంలో ఏటా 3.5 కోట్ల ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్(ECP) అమ్ముడవుతున్నట్లు మోర్డర్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ నివేదిక వెల్లడించింది. పదేళ్లలో 12% మేర విక్రయాలు పెరిగినట్లు తెలిపింది. వీటిని అధికంగా వాడితే ప్రమాదమని గైనకాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు కండోమ్ల అమ్మకాలు ఇండియాలో ఐదేళ్లలో 17% మేర తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.


