News September 12, 2025
నేడు ఇలా చేస్తే పితృశాపాలు తొలగిపోతాయి

నేడు మహాభరణి. ఇది పితృపక్షంలో భరణి నక్షత్రం రోజున వస్తుంది. ఈరోజున పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం చేయడం వల్ల వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పితృదోషాలు తొలగి, ఐశ్వర్యం, దీర్ఘాయువు ప్రాప్తిస్తాయి. నేడు యమదీపం వెలిగించడం శుభప్రదం. అన్నదానం, ఆవు నెయ్యి కలిపిన నల్ల నువ్వుల అన్నాన్ని కాకులకు పెట్టడం ద్వారా పితృశాపాలు తొలగిపోతాయి. వారి అనుగ్రహం లభిస్తుంది’ అని అంటున్నారు.
Similar News
News January 31, 2026
అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తున్నారా: సత్యకుమార్

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో నేడు చేసిన వ్యాఖ్యలు YSRCP నైజానికి అద్దం పడుతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ‘సీఎంని దుర్భాషలాడడం అత్యంత హేయం. జుగుప్సాకరం. అంబటి వ్యాఖ్యలను జగన్ సమర్థిస్తున్నారా? ఆ వ్యాఖ్యలపై జగన్ తక్షణం స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. అంబటి వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తల వికృత నైజం, అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
News January 31, 2026
ఒక్క రోజే రూ.85,000 తగ్గిన సిల్వర్ రేటు

బులియన్ మార్కెట్లో వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కేజీ వెండి రేటు <<19009714>>రూ.55వేలు తగ్గగా<<>>, గంటల వ్యవధిలోనే మరో రూ.30వేలు పడిపోయింది. దీంతో ఒక్కరోజులోనే సిల్వర్ రేటు రూ.85వేలు తగ్గి రూ.3,20,000కు చేరింది.
News January 31, 2026
యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే

AP: భూముల రీసర్వేలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దేలా కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ‘ప్రస్తుతం కొత్తగా చేపట్టే సర్వేలో భూయజమానిని తప్పనిసరిగా భాగస్వామిని చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆయన వచ్చాకనే రీసర్వే చేయాలి. భూ రికార్డు వివరాలను యజమానులకు చూపించి ఓకే అంటేనే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. ప్రతినెల 2-9 తేదీల మధ్య పాస్ పుస్తకాలు అందించాలి’ అని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్చింది.


