News November 13, 2024
చలికాలంలో పెదాలు పగలొద్దంటే..

* పెదాలు పగలడానికి డీహైడ్రేషన్ ప్రధాన కారణం. చలికాలం చాలామంది సరిపడా నీరు తాగరు. దీనివల్ల పెదాలు పొడిబారి, పగులుతాయి.
* పెదాలు కాస్త డ్రై అవగానే వాటిని నాలుకతో తడుపుతారు. ఇది పెదాలు మరింత పగలడానికి కారణం. పెదాలపై ఉండే స్కిన్ను కొరికేయవద్దు.
* విటమిన్ బీ, ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ కలిగిన ఆహారం తీసుకోండి.
* బయటికి వెళ్లేటప్పుడు కచ్చితంగా మంచి లిప్బామ్/పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి.
Similar News
News February 6, 2026
క్వాంటం వ్యాలీకి రేపే శంకుస్థాపన

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుంది. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో 2.30PMకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైతులు, విద్యార్థులతో ముచ్చటిస్తారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే క్వాంటం శిక్షణ కోసం 50వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
News February 6, 2026
శుక్ర దోష నివారణ మార్గాలు

శుక్ర దోష నివారణ కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. లలితా సహస్రనామ పఠనం చేయాలి. తెల్లని వస్తువులు దానం చేస్తే శుభం కలుగుతుంది. పాలు, పెరుగు, బియ్యం, పంచదార, తెలుపు వస్త్రాలు పేదలకు దానం చేయాలి. ‘ఓం శుం శుక్రాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తే శుక్రుని అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం, తెలుపు దుస్తులు ధరించడం మంచిది. సుగంధ ద్రవ్యాలు వాడితే శుక్రుడు ప్రసన్నమవుతాడని నమ్మకం.
News February 6, 2026
పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.


