News October 26, 2024

పుజారాను వద్దనుకుంటే జట్టులో వీరెందుకు?

image

NZతో టెస్ట్ సిరీస్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వెలువెత్తాయి. హిట్ మ్యాన్, కింగ్, ప్రిన్స్‌గా పేరొందిన ఆటగాళ్లు కనీసం స్పిన్ ముందు నిలవలేదని కొందరు పోస్టులు చేశారు. పుజారా వంటి ప్లేయర్‌ను స్వదేశంలో జరిగే మ్యాచులకు ఎంపిక చేయనప్పుడు వీరిని ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ భారత జట్టు యువ ప్లేయర్ల కోసం చూస్తే రోహిత్, కోహ్లీ ఇంకా యంగ్ ప్లేయర్లేనా అని ప్రశ్నిస్తున్నారు.

Similar News

News December 12, 2025

ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

image

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్‌, ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌ 2002 వంటివి ఆమె చేపట్టారు.

News December 12, 2025

తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్‌

image

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.

News December 12, 2025

ఇండిగోకు మరో దెబ్బ.. రూ.58.75 కోట్ల ట్యాక్స్ నోటీస్

image

విమానయాన సంస్థ ఇండిగోకు రూ.58.75 కోట్ల ట్యాక్స్ పెనాల్టీ నోటీసును ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌లోని సెంట్రల్ GST అదనపు కమిషనర్ జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. వివరాలను పరిశీలిస్తున్నామని అవసరమైతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపింది. ఇటీవల విమానాల రద్దు, ఆలస్యాల వివాదం మధ్య ఈ నోటీసు రావడం ఆ సంస్థపై మరింత ఒత్తిడి పెంచింది.