News March 15, 2025
బెడ్పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్ప్రూఫ్ ఫ్యాబ్రిక్తో స్పెషల్ బాత్ టబ్లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.
Similar News
News December 7, 2025
కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.
News December 7, 2025
గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 1/2

ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతుండటం తెలిసిందే. విమాన సర్వీసుల్లో అగ్ర వాటా(63%) ఇండిగోది కావడంతో సమస్య తీవ్రత పెరిగింది. ఎక్కడైనా ఓ సంస్థ/కొన్ని సంస్థల <<18493058>>గుత్తాధిపత్యం<<>> ఉంటే ఆ రంగంలో మిగతా సంస్థలు నిర్వీర్యమవుతాయి. టెలికం రంగం ఇందుకో ఉదాహరణ. ఇప్పుడు 4 కంపెనీలే ఉన్నాయి. Aircel, DoCoMo, Telenor, MTNL, Reliance వంటివి విలీనమయ్యాయి లేదా దివాలా తీశాయి. విమానయాన రంగంలోనూ దాదాపు ఇదే పరిస్థితి.
News December 7, 2025
గుత్తాధిపత్యం.. ఎప్పటికైనా ముప్పే! 2/2

గుత్తాధిపత్యం(Monopoly) వల్ల ఆ రంగంలో సర్వీసులు పరిమితమవుతాయి. వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు అతి తక్కువ. తాము ఎంచుకునే ఏ ధరనైనా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా సంస్థలకు ఉంటుంది. పోటీ పెద్దగా ఉండదు. కొత్త సంస్థలు ప్రవేశించాలన్నా చాలా కష్టం. చిన్న సంస్థలు వాటిలో విలీనం కావడమో, దివాలా తీయడమో జరుగుతుంది. బడా సంస్థల ఉత్పత్తి/సేవల్లో అంతరాయం ఏర్పడితే ఇండిగో లాంటి సంక్షోభం ఎదురవుతుంది. దీనిపై మీ కామెంట్?


