News December 18, 2024
భోజనం చేయగానే సోంపు తింటే..

భోజనం చేసిన వెంటనే సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే అనెథోల్ జీర్ణాశయ ఎంజైమ్ల ఉత్పత్తికి సహకరిస్తుంది. ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా సోంపు నివారిస్తుంది. ఇది చర్మం పొడిబారకుండా చేయడంతో పాటు దద్దుర్లు రాకుండా చేస్తుంది.
Similar News
News October 23, 2025
కరప్షన్, క్రైమ్.. ఇవే NDA డబుల్ ఇంజిన్లు: తేజస్వీ

ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కలిసి పని చేస్తామని ఆర్జేడీ నేత, మహాఘట్బంధన్ <<18080695>>సీఎం అభ్యర్థి<<>> తేజస్వీ యాదవ్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారులో ఒక ఇంజిన్ కరప్షన్, మరోది క్రైమ్ అని ఎద్దేవా చేశారు. బిహార్లో నేరాలు పెరిగిపోతున్నాయని, 200 రౌండ్ల కాల్పులు జరగని రోజంటూ లేదని అన్నారు. కొత్త బిహార్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. NDA సీఎం అభ్యర్థి ఎవరో BJP, అమిత్ షా క్లారిటీ ఇవ్వాలన్నారు.
News October 23, 2025
టాస్ గెలిచిన న్యూజిలాండ్

ఉమెన్స్ వరల్డ్ కప్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్లు నవీ ముంబై వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన NZW జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
INDW ప్లేయింగ్ Xl: ప్రతీకా, స్మృతి మంధాన, హర్లీన్, హర్మన్ప్రీత్(C), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి, రిచా, స్నేహ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
NZW: సుజీ బేట్స్, జార్జియా, అమేలియా, సోఫీ(C), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా, జెస్ కెర్, రోజ్మేరీ, లియా, ఈడెన్ కార్సన్
News October 23, 2025
220 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

జల్గావ్ DCC బ్యాంకులో 220 క్లర్క్(సపోర్ట్ స్టాఫ్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ పాసైన వారు అర్హులు. 21-35 ఏళ్ల వయసు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. అప్లికేషన్ ఫీజు రూ.1,000. ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://jdccbank.com/