News November 20, 2024
ఈ చేపలు తింటే అయోమయానికి లోనవుతారు!

చేపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయనే విషయం తెలిసిందే. అయితే, కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయి. అందులో మధ్యదరా సముద్రంలో దొరికే సలేమా పోర్జీ చేప ఒకటి. ఒకవేళ ఈ చేపను తింటే ఆశ్చర్యకరమైన దుష్ప్రభావం చూపుతుంది. దీనిని తిన్న వ్యక్తి 36 గంటల పాటు అయోమయానికి లోనవుతారు. ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేరు. రోమన్ సామ్రాజ్యంలో వినోద ప్రయోజనాల కోసం దీనిని తినేవారు.
Similar News
News January 27, 2026
NIRDPRలో 98 ఉద్యోగాలు… అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)లో 98 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. PG అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: career.nirdpr.in/
News January 27, 2026
ఢిల్లీ హైకోర్టులో పవన్ కుమారుడికి ఊరట

AP Dy.CM పవన్ కుమారుడు అకీరానందన్పై <<18950891>>AI వీడియో<<>> చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తన పేరుతో SMలో ఉన్న నకిలీ పేజెస్ తొలగించాలని కోరారు. హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. AI లవ్ స్టోరీపై నిషేధం విధించింది. SM పేజెస్ తొలగించాలని, IP వివరాలు బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్ వంటి సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
News January 27, 2026
సిట్ విచారణకు హాజరైన సంతోష్ రావు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి ఆయన PSకు చేరుకున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్లో సంతోష్ ప్రమేయం ఉందనే ఆరోపణలపై అధికారులు విచారించే అవకాశముంది. అంతకుముందు కేటీఆర్, హరీశ్ రావును సిట్ విచారించిన సంగతి తెలిసిందే.


