News November 18, 2024
ఇవి తింటే ఇప్పుడే ముసలితనం

కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముందుగానే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర, పిండి పదార్థాలతో తయారుచేసే పిజ్జా, బర్గర్, పఫ్స్, స్వీట్లు తింటే అకాల వృద్ధాప్యం దరి చేరుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా చర్మంపై ముడతలు వచ్చి ముసలితనం కనిపిస్తుంది. టీ, కాఫీ, మద్యపానం ఎక్కువగా చేసినా త్వరగా ముసలివారు అయిపోతారు. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.
Similar News
News January 23, 2026
పెరటి కోళ్ల పెంపకం.. స్వర్ణధార కోళ్ల ప్రత్యేకత ఇదే

స్వర్ణధార కోళ్లు కూడా పెరటి కోళ్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. ఏడాదికి 190 వరకు గుడ్లను పెడతాయి. గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం ఎక్కవ మంది పెరటి కోళ్ల పెంపకానికి స్వర్ణధార కోళ్లను ఎంపిక చేసుకుంటారు. ఇవి 22 నుంచి 23 వారాల్లో సుమారు 3 నుంచి 4 కిలోల బరువు పెరుగుతాయి. వీటి గుడ్డు బరువు 50-60 గ్రాములుంటుంది. స్వర్ణధార కోళ్లకు గుడ్లు పొదిగే సామర్థ్యం 80-85%గా ఉంటుంది.
News January 23, 2026
రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News January 23, 2026
వసంత రుతువు రాకను సూచించే పండుగ

వసంత పంచమి అంటే వసంత కాలానికి స్వాగతం పలికే రోజు. మాఘ మాసంలో ఐదవ రోజున ఈ పండుగ వస్తుంది. ఇది చలికాలం ముగింపును, ప్రకృతిలో వచ్చే మార్పులను సూచిస్తుంది. ఈ సమయంలో ఆవ చేలు పసుపు రంగు పూలతో కళకళలాడుతుంటాయి. పసుపు రంగు జ్ఞానానికి, శక్తికి, శాంతికి చిహ్నం. అందుకే కొత్త పనులు ప్రారంభించడానికి, పెళ్లిళ్లకు లేదా కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి ఈ రోజును అత్యంత శుభప్రదమైనదిగా భారతీయులు భావిస్తారు.


