News October 22, 2024

మెడిసిన్‌కు అలవాటు పడితే?

image

పెయిన్ కిల్లర్స్‌తో తక్షణ ఉపశమనం పొందినా రెగ్యులర్‌గా తీసుకుంటే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక నొప్పులను తగ్గించేందుకు వాడితే దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (NSD) మెడిసిన్ వాడకం వల్ల కిడ్నీ, కాలేయ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. వైద్యుల సూచనతో వీటి వాడకాన్ని కొంత సమయానికే పరిమితం చేయాలని సూచిస్తున్నారు.

Similar News

News October 23, 2025

తెలంగాణ రౌండప్

image

* రేపు ఫిరాయింపు MLAలను విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..
* రంగారెడ్డి, వికారాబాద్, HNK, మేడ్చల్‌లో డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
* వచ్చే నెల 20 నుంచి రాష్ట్రంలో పులుల లెక్కింపు.. నేటి నుంచి జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ
* రంగారెడ్డిలోని కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్‌లోని బహదూర్‌ పల్లి రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ నెల 28 నుంచి 30వరకు ఈ-వేలం

News October 23, 2025

అకాలపు వాన.. అరికల కూడు

image

ఇప్పుడు మనకు సాధారణంగా కనిపించే వరి అన్నం ఒకప్పుడు చాలా అరుదు. కేవలం ధనికుల ఇళ్లలోనే వండుకునేవారు. సామాన్యులు ఎక్కువగా అరికల అన్నం తినేవారు. కొత్తగా వరి పండించే రోజుల్లో ‘అకాలపు వాన.. అరికల కూడు’ అనే సామెత ప్రాబల్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. వాన అదును తప్పి కురిస్తే ధనవంతులు కూడా అరికల కూడు తినాల్సిందేనన్నది దీని అర్థం.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి

News October 23, 2025

నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులివే..

image

40 ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధులొచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయంటున్నారు. ముఖ్యంగా బోలుఎముకలవ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మానసిక ఒత్తిడి దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులే వీటికి కారణమంటున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.