News December 1, 2024
రేషన్ బియ్యం బదులు డబ్బులు ఇస్తే?

ప్రభుత్వాలు కేజీ రేషన్ బియ్యానికి రూ.43 ఖర్చు పెడుతున్నాయి. సబ్సిడీ కింద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి. క్వాలిటీగా ఉండవనే భావనతో 70-80% మంది వాటిని తినకుండా KG రూ.10 చొప్పున అమ్ముకుంటున్నారు. అక్రమార్కులు వీటిని ప్రాసెస్ చేసి KG రూ.80-100 వరకు విదేశాలకు ఎగుమతి చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వాలు బియ్యం బదులు నేరుగా సబ్సిడీ సొమ్మును ప్రజల ఖాతాల్లో వేస్తే ఈ దందాను ఆపే అవకాశం ఉంది. మీరేమంటారు?
Similar News
News December 6, 2025
కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు ఉన్నట్టా.. లేనట్టా.?

జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన సమయంలో మినహా ఆయన కనిపించరని, రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో, కృష్ణా జిల్లా నేతలు, కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం NTR జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభానును కలుస్తున్నట్లు సమాచారం.
News December 6, 2025
APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.


