News March 30, 2024

ఈతకు వెళితే.. గొంతులో చేప ఇరుక్కుపోయింది

image

స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్(14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సగం చేపను మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.

Similar News

News February 1, 2026

పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా దక్కేనా?

image

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా దక్కుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. జాతీయ హోదా లభిస్తే 90 శాతం నిధులు కేంద్రమే భరిస్తుంది. తద్వారా పనులు వేగవంతమై వలసలు తగ్గుతాయి. ఆరు జిల్లాల పరిధిలోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యం.

News February 1, 2026

రేషన్‌లో గోధుమ పిండి.. నేటి నుంచే పంపిణీ

image

AP: ప్రభుత్వం రేషన్‌లో గోధుమ పిండిని పంపిణీ చేయనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో ఇవాళ్టి నుంచి కిలో రూ.20కే అందజేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలోనే మండల స్థాయిలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అర్హులైన వారికి పెన్షన్లు ఇస్తామని తెలిపారు. దీపం పథకం కింద నాలుగో విడత రాయితీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని, మార్చి నెలాఖరు లోపు బుక్ చేసుకోవాలని సూచించారు.

News February 1, 2026

‘కాపు నేత’పై దాడి అని వైసీపీ ట్వీట్

image

AP: YCP నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై TDP కార్యకర్తలు దాడి చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ‘కాపు నేత’పై టీడీపీ దాడి చేసిందని వైసీపీ అఫీషియల్ X పేజీలో #TDPAntiKapu అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. ‘నాడు వంగవీటి రంగాను హత్య చేశారు. మొన్న ముద్రగడ కుటుంబంపై, నేడు అంబటిపై దాడి చేశారు. తర్వాత మాపై దాడి చేస్తారా?’ అని మాజీ మంత్రి తోట త్రిమూర్తులు మండిపడ్డారు.