News March 30, 2024
ఈతకు వెళితే.. గొంతులో చేప ఇరుక్కుపోయింది

స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని జాంజ్గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్(14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సగం చేపను మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.
Similar News
News April 10, 2026
జాబ్ ఆఫర్ చేసిన MNC.. షాక్ ఇచ్చిన అభ్యర్థి

జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకే షాక్ ఇచ్చాడు కన్సల్టెంటుగా పనిచేసిన ఓ అభ్యర్థి. ‘ఓ MNCలో అన్నీ అధ్వానంగా ఉంటాయి. నా CVకి సరిపోయే జాబ్ ఉందని ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కానీ వాళ్ల సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టానని, అందులో పని చేయనని చెప్పేశా. ఇవి పిల్ల చేష్టలని అనుకోవచ్చు. కానీ అదెంతో అద్భుతంగా, సంతృప్తిగా అనిపించింది. మళ్లీ సంప్రదిస్తే CEO ఏడ్చేలా ఈ-మెయిల్ పంపుతా’ అని రెడిట్లో రాసుకొచ్చారు.
News April 10, 2026
యుద్ధం.. శాంతి చర్చలకు పాక్ బయల్దేరిన జేడీ వాన్స్

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్తో శాంతి చర్చల్లో పాల్గొనేందుకు కాసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్కు బయల్దేరారు. ఇస్లామాబాద్లోని సెరెనా హోటల్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. చర్చల ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్లో 2 రోజులు లాక్డౌన్ విధించారు.
News April 10, 2026
ఇండక్షన్ స్టవ్స్కు డిమాండ్.. కేంద్రం చర్యలు!

గ్యాస్ కొరత కారణంగా దేశంలో ఇండక్షన్ స్టవ్స్ వాడకం పెరుగుతోంది. రాబోయే రోజుల్లో 40% డిమాండ్ పెరగొచ్చని, అందుకు అదనంగా 27GW విద్యుత్ అవసరం పడుతుందని భావిస్తోంది. దీంతో డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఇండక్షన్ స్టవ్ కంపెనీలతో చర్చిస్తోంది. అలాగే విద్యుదుత్పత్తి విషయంలోనూ చర్యలకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో LPG కొరత ఏర్పడటంతో ప్రజలు భారీగా ఇండక్షన్ స్టవ్లు కొంటున్నారు.


