News August 9, 2025
వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వండి: బొత్స

AP: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని, ఆ సమయంలో కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ‘జగన్ సీఎం అయ్యాకే కేసును సీబీఐకి అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. వివేకా హత్యపై ఆధారాలు ఉంటే కోర్టుకు ఇవ్వాలి. విశాఖ భూదోపిడీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దీని వెనుక పెద్దల హస్తం ఉంది’ అని బొత్స ఆరోపించారు.
Similar News
News August 10, 2025
ఇండియన్ నేవీలో జాబ్స్.. నోటిఫికేషన్ రిలీజ్

ఇండియన్ నేవీ 1266 సివిలియన్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పదో తరగతి పాసై ITI సర్టిఫికెట్/ సంబంధిత విభాగంలో శిక్షణ పొంది 18-25 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా ఏజ్ సడలింపు ఉంటుంది. ఈనెల 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు indiannavy.gov.in సైట్లో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.19,900-రూ.63,200 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News August 10, 2025
మా డిమాండ్ ఇదే.. మద్దతు తెలపండి: రాహుల్

ఓట్ చోరీ జరిగిందన్న LOP రాహుల్ గాంధీ <<17330640>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అత్యవసరమన్నారు. ‘పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేయాలని ECని డిమాండ్ చేస్తున్నాం. http://votechori.in/ecdemandను విజిట్ చేసి, లేదా 9650003420కు మిస్డ్ కాల్ ఇచ్చి మాకు మద్దతు తెలపండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.
News August 10, 2025
APL: 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో విజయవాడ సన్షైనర్స్ ప్లేయర్ జహీర్ అబ్బాస్ సంచలనం నమోదు చేశారు. కాకినాడ కింగ్స్తో జరుగుతున్న మ్యాచులో 17 బంతుల్లోనే ఫిఫ్టీ బాదారు. 19 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 57 రన్స్ చేశారు. ఈ సీజన్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జహీర్, తేజ(46*) విధ్వంసంతో విజయవాడ 195 పరుగులు చేసింది. కాకినాడ పరుగుల వేటలో పడింది.