News March 29, 2024

ఫోన్ కాల్స్ వింటే చిప్పకూడు తినాల్సి వస్తుంది: సీఎం

image

TG: ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండని అంటున్నారు. ఎవరైనా కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తారా? కొన్ని ఫోన్ కాల్స్ విన్నామని KTR చెప్తున్నారు. వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. BRS చెప్పినట్టు విన్న అధికారుల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తప్పకుండా చర్యలుంటాయి’ అని అన్నారు.

Similar News

News September 15, 2025

15 శాతం వృద్ధిరేటు సాధనే ధ్యేయం: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. 15 శాతం వృద్ధి రేటు సాధనే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ‘విభజన వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయింది. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ-4ను తీసుకువచ్చాం. టెక్నాలజీని ఉపయోగించుకుని హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News September 15, 2025

పత్తిలో కలుపు నివారణకు ఇలా చేయండి

image

* పత్తి మొలకెత్తిన నెల రోజులకు కలుపు కనిపిస్తే క్విజలాఫాప్ ఇథైల్ 400ML లేదా ప్రోఫాక్విజఫాప్ 250ML, పైరిథయోబాక్ సోడియం 250ML 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
* ప్రతి పది రోజులకొకసారి గొర్రు, గుంటకలతో అంతరకృషి చేయాలి. కలుపును ఏరివేయాలి.
* వర్షాలు ఎక్కువగా ఉండి కలుపు తీయడం కుదరకపోతే పారాక్వాట్ 5ML+ 10గ్రా. యూరియాతో లీటరు నీటికి కలిపి పత్తి మొక్కలపై పడకుండా వరుసల మధ్య మాత్రమే పిచికారీ చేయాలి.

News September 15, 2025

విషాదం.. సెలవు అడిగిన 10 నిమిషాలకే

image

‘ఆరోగ్యం బాలేదు, సెలవు కావాలి’ అని అడిగిన 10 నిమిషాలకే ఓ ఉద్యోగి గుండె ఆగి మరణించాడు. ‘శంకర్(40) అనే కొలీగ్ సిక్ లీవ్ ఇవ్వాలని ఉ.8.37 గం.కు మెసేజ్ పెట్టగా, 8.47కు కార్డియాక్ అరెస్టుకు గురై చనిపోయారు. ఈ విషయం తెలిసి షాకయ్యాను. శంకర్‌కు ఎలాంటి దురలవాట్లు లేవు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం’ అని అతడి పై అధికారి అయ్యర్ ట్వీట్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఏ కంపెనీ? అనేది తెలియాల్సి ఉంది.