News April 2, 2024
జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తొస్తాయి: సీఎం

AP: చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకు రాదని CM జగన్ ఎద్దేవా చేశారు. జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తాయని పేర్కొన్నారు. ‘జగన్ పేరు చెబితే గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ గుర్తొస్తాయి. లంచాలు లేని పాలన అంటే గుర్తొచ్చేది జగన్. వివిధ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ లబ్ధి చేకూర్చాం’ అని తెలిపారు.
Similar News
News October 18, 2025
ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.
News October 18, 2025
నేడు మద్యం, మాంసం వద్దు! ఎందుకంటే..?

ధన త్రయోదశి పర్వ దినాన మాంసం, మద్యం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదని అంటున్నారు. ‘నలుపు రంగు వస్తువులు కొనుగోలు చేయకూడదు. గృహోపకరణాలు దానం చేయడం, అమ్మడం వంటివి చేయకండి. నేడు ఎవరికీ రుణం ఇవ్వకూడదు. ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా, ప్రతి చోట పరిశుభ్రత, దీపాల వెలుగు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది’ అని సూచిస్తున్నారు.
News October 18, 2025
సమ్మె విరమించిన విద్యుత్ ఉద్యోగ సంఘాలు

AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులతో 12 గంటలు సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లకు యాజమాన్యాలు ఒప్పుకోవడంతో సమ్మె విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు, వారికి నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీకి కూడా అంగీకారం లభించింది.