News September 23, 2025

రోజూ గాయత్రీ మంత్రం పఠిస్తే..

image

‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి! ధియో యో నః ప్రచోదయాత్!!’ అనే గాయత్రీ మంత్రాన్ని మించిన మంత్రం లేదని పురాణాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని జపం చేయాలి. ఇలా రోజూ చేస్తే జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గి సంతోషం, గెలుపు దక్కుతాయని, దుఃఖం, బాధలు, దారిద్ర్యం, పాపాలన్నీ తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు.

Similar News

News September 23, 2025

ఫాస్ట్‌ఫుడ్‌తో సంతానోత్పత్తి సమస్యలు

image

ఫాస్ట్‌ఫుడ్స్ వలన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని అందరికీ తెలిసిందే. ఆడవారిలో వీటివల్ల సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైంటిస్టులు చేసిన అధ్యయనంలో పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ ఫుడ్స్‌లో పెర్ఫ్లూక్టేనోయిక్ యాసిడ్, పెర్ఫ్లూరూక్టేన్ సల్ఫోనేట్ కలుస్తాయని వెల్లడైంది. ఇవి మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతాయని తేలింది.

News September 23, 2025

పశువుల్లో సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి?

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో చాలావరకు బాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌, పరాన్నజీవుల వల్లే వస్తాయి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, స్రావాలు, శ్వాస ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు బయటకు విడుదలవుతాయి. ఇవి ఇతర పశువులకు ఆహారం, నీరు, గాలి, గాయాల ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధి సోకిన పశువుల పాలను సరిగా మరిగించకుండా, మాంసాన్ని బాగా ఉడికించకుండా తింటే మనుషులకూ వ్యాపిస్తాయి. వీటినే ‘సంక్రమిత వ్యాధులు’ అంటారు.

News September 23, 2025

‘టాప్ 2%’ శాస్త్రవేత్తల్లో 3,372 మంది ఇండియన్స్

image

వరల్డ్‌లోని ‘టాప్ 2%’ శాస్త్రవేత్తల్లో 3,372 మంది ఇండియన్స్ ఉన్నట్లు USలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ తెలిపింది. శాస్త్రవేత్తలు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్, తదితర అంశాలను పరిగణించి లిస్ట్‌ రిలీజ్ చేసింది. ఇందులో ఇండియాలోని IITల నుంచి 755 మంది, NITల నుంచి 330 మంది ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని IIT, NIT, HCU, IIM(వైజాగ్), ఇతర వర్సిటీల నుంచి 100 మందికి పైగా చోటు దక్కించుకున్నారు.