News October 8, 2024
ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే..

ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా కేంద్రం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.
Similar News
News February 2, 2026
అన్నిటికీ నేనే మాట్లాడాలా? మరి మీరెందుకు: పార్టీ నేతలపై పవన్ ఆగ్రహం

AP: పార్టీ నేతలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో YCP దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం లేదని మండిపడ్డారు. ‘అన్నిటికీ నేనే మాట్లాడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు? వైసీపీ దుష్ప్రచారంపై మీరు మాట్లాడాలి కదా?’ అని నిలదీశారు. మహిళల విషయంలో పార్టీనేతలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
News February 2, 2026
రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం: CM రేవంత్

TG: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ పేరిట PM మోదీ రాజ్యాంగాన్నే మార్చేందుకు కుట్ర పన్నుతున్నారని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ‘వన్ పర్సన్.. వన్ పార్టీ’ విధానాన్ని తెచ్చేందుకు BJP ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని తొలగించేందుకే 400 సీట్లు అడిగారని అందుకే ప్రజలు వారికి సింపుల్ మెజార్టీ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఓటు హక్కును కాలరాయడానికి ‘SIR’ పేరిట ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
News February 2, 2026
టూరిస్ట్ స్పాట్గా డంప్యార్డ్.. ఎలా మారింది?

రాజస్థాన్లోని కిషన్గఢ్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు SMలో సెన్సేషన్గా మారింది. ‘రాజస్థాన్ స్విట్జర్లాండ్’గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి మార్బుల్ వ్యర్థాల డంప్యార్డ్. మార్బుల్ కటింగ్ నుంచి వచ్చే తెల్లటి పౌడర్ కొండల్లా పేరుకుపోయి వర్షపు నీరు చేరడంతో అచ్చం మంచు కొండల మధ్య నీటి సరస్సులా కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఇన్స్టా రీల్స్, సినిమా షూటింగ్స్కి అడ్డాగా మారింది. ఈ డస్ట్ ఆరోగ్యానికి ప్రమాదకరం.


