News July 24, 2024

బడ్జెట్‌లో ఇతర రాష్ట్రాలను పట్టించుకోరా?: శ్రీధర్ బాబు

image

దేశంలోనే తెలంగాణ అతిపెద్ద గ్రోత్ ఇంజిన్ అయినా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవేవీ ప్రకటించలేదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో దుయ్యబట్టారు. ‘ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోరా? ఇలాగే వ్యవహరిస్తే మీరు ఆశించిన వికసిత్ భారత్ సాధ్యమా? పర్యాటకాభివృద్ధికి సహకరించాలని ఢిల్లీ పెద్దలను కోరాం. కానీ భద్రాచలం, రామప్ప, వేములవాడ, యాదాద్రి గురించి ప్రస్తావనే లేదు’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News October 15, 2025

ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు

image

TG: సింగరేణి కార్మికులకు అక్టోబర్ 17న దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR)గా పిలిచే ఈ బోనస్ కింద ఈ ఏడాది రూ.1.03 లక్షల చొప్పున చెల్లించేలా బొగ్గు సంస్థల <<17842581>>యాజమాన్యాలు <<>>అంగీకరించాయి. కోల్ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థలూ బోనస్ చెల్లించనుండగా, సింగరేణి మినహా మిగతా వారికి దసరా సమయంలోనే అందించారు. ఎల్లుండి సింగరేణి కార్మికుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

News October 15, 2025

వంటింటి చిట్కాలు

image

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.

News October 15, 2025

అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: లోకేశ్

image

AP: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉత్తరాంధ్రలో TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తిరుపతి శ్రీసిటీలో డైకెన్, బ్లూస్టార్, LG సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం’ అని వెల్లడించారు.