News June 27, 2024

IIIT అడ్మిషన్ల పక్రియ కన్వీనర్‌గా అమరేంద్ర

image

ఆర్జీయూకేటీ పరిధిలోని ఆయా IIITలో 2024-25 సంవత్సరానికి జరిగే అడ్మిషన్ల పక్రియ అధ్యాపకుడిగా డా.అమరేంద్ర కుమార్‌ను అధికారులు నియమించారు. దీనిపై ట్రిపుల్ ఐటీ అధ్యాపకులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో అమరేంద్ర కుమార్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా పని చేశారన్నారు.

Similar News

News November 23, 2025

కడప: గ్రామ స్థాయికి వెళ్లని స్వచ్ఛాంధ్ర ప్రచారం?

image

ప్రతి నెలా 3వ శనివారం అధికారులు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ ప్రచారం చేసినా, గ్రామస్థాయిలో అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఆదివారం కమలాపురం మండలం <<18369261>>ఎర్రగుడిపాడులోని<<>> ఓ కాలనీ ప్రజలు విరేచనాలు, వాంతులతో మంచాన పడ్డారు. దీనికి కారణం అక్కడి వారికి పారిశుద్ధ్యంపైన అవగాహన లేకపోవడమేనని పలువురు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అధికారులు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లట్లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.

News November 23, 2025

సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన కడప జట్టు

image

69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌ బాల్ అండర్-14 పోటీల్లో కడప జిల్లా బాలురు, బాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలురు గోదావరి జట్టును, బాలికలు కృష్ణా జట్టును ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాయి. అలాగే ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, విజయనగరం బాలికల జట్లు కూడా సెమీఫైనల్‌కు చేరాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జట్లు సెమీస్‌లో ప్రవేశించాయి. రేపు ఉదయం సెమీఫైనల్స్ జరగనున్నాయి.

News November 23, 2025

మైదుకూరు: గౌడౌన్‌లలో నిల్వ ఉన్న 6858.45 కేజీల స్టీల్‌పై అనుమానాలు

image

మైదుకూరు హౌసింగ్ శాఖకు సంబంధించిన స్టీలు నిల్వల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో 6858.45 కేజీల స్టీలు పంపిణీలో అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులకు నివేదికలు వెళ్లాయి. అయితే విచారణకు అధికారులు వచ్చే లోపు స్టీలు అందుబాటులో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై తిరిగి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న స్టీలు గతంలో సరఫరా చేసిందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.