News September 25, 2024
జియోగ్రిడ్ల తయారీకి IIT HYD, ఇండోర్ శ్రీకారం

తాజ్ మహల్ నిర్మాణ శైలి, భారతీయ నక్షత్ర తాబేలుపై కనిపించే నమూనాల నుంచి ప్రేరణ పొంది జియోగ్రిడ్ల తయారీకి IIT ఇండోర్ – IIT HYD చేతులు కలిపాయి. జియోగ్రిడ్లు మట్టిలో స్థిరత్వం, లోడ్ బేరింగ్ సామర్థ్యం పెంపునకు ఉపకరిస్తాయి. నేల కోత – కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి, రోడ్లు, వంతెనల నిర్మాణాలకు స్థిరమైన పునాదిని అందించడానికి ఇందులో జియో సింథటిక్ పదార్థాలను ఉపయోగిస్తారు.
Similar News
News December 25, 2025
పశువుల్లో ‘జోన్స్’ వ్యాధి లక్షణాలు – జాగ్రత్తలు

ఈ వ్యాధి సోకిన పశువు చర్మం మొద్దుబారడం, బక్కచిక్కడం, వెంట్రుకలు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫలితంగా పశువులకు ఆకలి ఉండదు. దీంతో శరీరం అంతా నీరసించి లేవలేని స్థితికి చేరుతుంది. ఈ వ్యాధిని నిర్మూలించాలంటే అంత సులువు కాదు. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ. పశువు యొక్క స్థితిని బట్టి సెలైన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ ఉండే ఆహారం అందించాలి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.
News December 25, 2025
ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గురించి తెలుసా?

కర్ణాటకలోని తుప్పూరు కి చెందిన డాక్టర్ కె. నందిని పీహెచ్డీ పూర్తయిన వెంటనే ఇస్రోలో ఉద్యోగంలో చేరారు. 20ఏళ్లుగా ఇస్రోలో ఉద్యోగం చేస్తున్న ఆమె 14పైగా మిషన్లలో పనిచేశారు. ప్రాజెక్ట్ మేనేజర్, మిషన్ డిజైనర్గా వర్క్ చేయడంతో పాటు మంగళయాన్ ప్రాజెక్ట్లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరక్టర్గా ఈమె వ్యవహరించారు. అలాగే ఎన్నో సత్కారాలు పొందడంతో పాటు 2015లో ‘ఇండియా టుడే ఉమెన్ ఇన్ సైన్స్’ అవార్డు కూడా అందుకున్నారు.
News December 25, 2025
నా వీర్యంతో పిల్లలను కంటే ఖర్చునాదే: దురోవ్

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. 37ఏళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న వాళ్లు తన వీర్యం ద్వారా IVFతో పిల్లలను కంటే ఖర్చులు భరిస్తానని ప్రకటించినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. స్పెర్మ్ డొనేషన్ ద్వారా ఆయన ఇప్పటికే వంద మందికిపైగా పిల్లలకు తండ్రిగా ఉన్నారు. ఈ నిర్ణయంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అలాగే ఆయన తన ఆస్తి మొత్తాన్ని తన పిల్లలకు సమానంగా పంచుతానని గతంలోనే ప్రకటించారు.


