News October 6, 2024

18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!

image

అధిక రాబ‌డులు ఆశ‌చూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెర‌ల్ ఆగ్రో కార్పొరేష‌న్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్ల‌పాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల‌ మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వ‌సూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.

Similar News

News October 6, 2024

సికింద్రాబాద్ నుంచి గోవా ట్రైన్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే

image

సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.

News October 6, 2024

18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్

image

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.61 కోట్లను సీజ్ చేశారు. తెలంగాణలో రూ.6.94 కోట్లు దోచేసిన ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 400కిపైగా కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు, డ్రగ్స్, కొరియర్, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారు

News October 6, 2024

దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

సుధీర్ వర్మ డైరెక్షన్‌లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.