News September 10, 2024
నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు: జెత్వానీ

సోషల్ మీడియాలో తనను కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారని నటి కాదంబరి జెత్వానీ వాపోయారు. ‘కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు సాకుతో కొందరు ఐపీఎస్ అధికారులు నన్ను వేధించారు. వారిపై చర్యలు తీసుకోవాలి. ఓ టెర్రరిస్ట్లా నన్ను చూశారు. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టవద్దు. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ బిజీగా ఉంది. ఎప్పటికైనా నాకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
News November 18, 2025
VZM: వారసుల ఎంట్రీ.. వచ్చే ఎన్నికల కోసమేనా..!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో యువ నాయకులు ప్రజల్లో కలయ తిరుగుతున్నారు. చీపురుపల్లిలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ అనూష విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే.. ప్రస్తుత ఎమ్మెల్యే కళావెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు యాక్టీవ్ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కుమార్తె శ్రావణి, జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర సైతం వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
News November 18, 2025
కొండెక్కిన ‘కోడిగుడ్డు’

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలతో పాటు కోడి గుడ్ల రేట్లు కూడా కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం, అయ్యప్ప దీక్షల సమయంలో వినియోగం తగ్గినా రేటు పైపైకి వెళ్తోంది. జూన్లో ఫారం వద్ద ఒక్కో ఎగ్ ధర ₹4.60 ఉండగా, రిటైల్ మార్కెట్లో ₹5.50 పలికింది. ఇప్పుడు ఫారంలో ₹6కు, రిటైల్లో ₹7కు చేరింది. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడం, గుడ్ల ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.


