News September 17, 2024

గణేశ్ నిమజ్జనం.. తెలంగాణ పోలీసుల సూచన

image

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. ‘గణేశ్ నిమజ్జనంలో ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సాహాలతో పాల్గొనాలి. ఎక్కడా గొడవలకు తావివ్వకూడదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకండి. ఎవరైనా మీకు అమర్యాదగా, అసభ్యకరంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కి లేదా దగ్గర్లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 15, 2025

కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

image

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.

News September 15, 2025

మైథాలజీ క్విజ్ – 6

image

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత

News September 15, 2025

ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి: CM చంద్రబాబు

image

AP: నష్టాల్లో కూరుకుపోయిన ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖల మంత్రులకు CM చంద్రబాబు లేఖలు రాశారు. ‘US టారిఫ్స్‌తో ఆక్వా రంగానికి రూ.25 వేల కోట్ల నష్టం జరిగింది. 50 శాతం ఆర్డర్లు రద్దయ్యాయి. ఆక్వా రైతులు నష్టపోకుండా కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలి. ఆక్వా రుణాల వడ్డీలపై మారటోరియం విధించాలి’ అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.