News August 8, 2024
వక్ఫ్ బోర్డు కింద ఉన్న స్థిరాస్తులివే!

వక్ఫ్ బోర్డు కింద దేశవ్యాప్తంగా 8,72,324 ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయి. ఉత్తర్ప్రదేశ్లో 27%( 2,32,547), బెంగాల్లో 9%(80,480), తెలంగాణలో 5% (45,682) ప్రాపర్టీలు కలిగి ఉంది. ఈ డేటాను వక్ఫ్ బోర్డు మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది.
Similar News
News November 1, 2025
ఏకాదశి వ్రతం ఎలా పాటించాలి?

ఏకాదశి వ్రతం పాటించే భక్తులు ఆ రోజున ఉపవాసం ఉండాలి. విష్ణువును తులసి మాలలతో పూజించాలి. రాత్రంతా పురాణ శ్రవణం చేస్తూ, జాగరణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి ఘడియల్లో మళ్లీ విష్ణు పూజ చేసి, భోజనం స్వీకరించాలి. అలా వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నారద పురాణం ప్రకారం.. ధాన్యం, సంపద, ఉన్నత స్థానం లభిస్తాయని నమ్మకం. యజ్ఞయాగాలు, పుణ్యక్షేత్ర దర్శనాల ఫలం కన్నా ఎన్నో రెట్ల అధిక పుణ్యం వస్తుందట.
News November 1, 2025
పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.
News November 1, 2025
ఇండస్ నీరు ఏమాత్రం ఆగినా పాక్లో వినాశనమే: IEP

పాకిస్థాన్లో 80% వ్యవసాయం ‘ఇండస్’ నీటిపైనే ఆధారపడింది. ఈ బేసిన్ అత్యధిక భాగం ఉన్న ఇండియా కనుక నీటి ప్రవాహాన్ని ఏమాత్రం ఆపినా పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ పేర్కొంది. పాక్లోని సింధునది ఆనకట్టల్లో 30రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదని పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలంపాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.


