News July 19, 2024
భారత్లో 10 బ్యాంకులపై ప్రభావం: RBI

సాంకేతిక సమస్యతో మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించిపోవడంతో దేశంలో 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై ప్రభావం పడిందని RBI వెల్లడించింది. అయితే అది స్వల్ప అంతరాయమేనని స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రయిక్ను వినియోగిస్తున్నాయని వివరించింది. కాగా క్రౌడ్ స్ట్రయిక్లో లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు గంటల కొద్ది నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
BREAKING: హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

సున్నంచెరువు కూల్చివేతల వ్యవహారంపై హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. FTL నిర్ధారణ లేకుండా హద్దులు నిర్ణయించడం, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పట్టించుకోకపోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సియేట్ మారుతీహిల్స్ కాలనీలో ఇకపై ఫెన్సింగ్, కూల్చివేత చర్యలకు దిగొద్దని హైకోర్టు హెచ్చరించింది.
News November 27, 2025
పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.
News November 27, 2025
ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <


