News January 12, 2025

మాంజాపై నిషేధాన్ని అమలు చేయండి: హైకోర్టు

image

TG: గాలిపటాలకు నైలాన్ దారాలను లేదా మాంజాను ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వీటి విక్రయాన్ని నిషేధిస్తూ 2017లో NGT ప్రధాన బెంచ్ వెల్లడించిన తీర్పును అమలు చేయాలని పేర్కొంది. ఉత్తర్వుల అమలుపై వివరాలు సమర్పించాలని హోం, అటవీ, పర్యావరణ శాఖల సీఎస్‌లకు, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

Similar News

News October 18, 2025

వైకల్య ధ్రువీకరణకు కేంద్రం కొత్త రూల్స్

image

వైకల్య ధ్రువీకరణకు సవరించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను కేంద్రం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అభ్యర్థులు సమర్పించే సర్టిఫికేట్స్ పరిశీలనలో ఈ రూల్స్ పాటించాలని స్పష్టం చేసింది. ప్రతి సర్టిఫికేట్‌ను, యునిక్ డిజబిలిటీ ఐడీ కార్డును జాతీయ పోర్టల్‌లో చెక్ చేయాలని ఆదేశించింది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌తో ఆయా సంస్థలు అనుసంధానం చేసుకోవాలని సూచించింది.

News October 18, 2025

DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

image

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDE) 5 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, B.TEXT, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, CSIR-UGC NET, గేట్ స్కోరు సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్వాలియర్‌లో DRDEలో నవంబర్ 6న ఉదయం 9.30గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News October 18, 2025

మాక్ అసెంబ్లీ.. 21 నుంచి విద్యార్థుల ఎంపిక

image

AP: అమరావతిలో వచ్చే నెల 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అందుకోసం ఈ నెల 21, 22 తేదీల్లో 6-8 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో మండలస్థాయి పోటీలు, ఈ స్థాయి నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి 29, 30 తేదీల్లో నియోజకవర్గ లెవల్‌లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 175 మందిని ఎంపిక చేసి అమరావతి అసెంబ్లీకి తీసుకెళ్తారు.