News February 7, 2025

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

image

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News December 11, 2025

సర్పంచ్ ఎన్నికలు.. 9 ఓట్లతో గెలిచాడు

image

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. స్వల్ప ఓట్ల తేడాతో కొందరు అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో బీఆర్ఎస్ బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో గెలిచారు. అటు జగిత్యాల జిల్లా తిమ్మాపూర్‌ తండాలోనూ బీఆర్ఎస్ బలపరిచిన మెగావత్ లత 12 ఓట్లతో విజయం సాధించారు.

News December 11, 2025

ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై కమిటీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఏడుగురితో కమిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు GO880 విడుదల చేసింది. CS నేతృత్వంలో GAD, ఫైనాన్స్, హెల్త్ సెక్రటరీలు, AP గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ల ప్రెసిడెంట్లు సభ్యులుగా, NTR వైద్యసేవా ట్రస్టు CEO కన్వీనర్‌గా ఉన్నారు. కాగా 8 వారాల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఈ కమిటీకి కాలపరిమితిని నిర్దేశించింది.

News December 11, 2025

పంచాయతీ ఎన్నికలు.. అత్యధిక పోలింగ్ ఎక్కడంటే?

image

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93 శాతం పోలింగ్‌ నమోదైంది. తర్వాతి స్థానాల్లో సూర్యాపేట(87.77%), మెదక్‌(86%), నల్గొండ(81.63%), వరంగల్‌(81.2%), నిర్మల్‌(79.81%), మంచిర్యాల(77.34%), హన్మకొండ(75.6%), ములుగు(73.57%), జనగాం(71.96%), ఆదిలాబాద్‌(69.10%) జిల్లాలున్నాయి.