News February 7, 2025

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

image

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News December 14, 2025

భారత్‌లోనూ ఉగ్ర దాడులకు కుట్ర?

image

ఆస్ట్రేలియాలో <<18562319>>కాల్పుల<<>> నేపథ్యంతో భారత్‌లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు టెర్రర్ గ్రూపులు కుట్ర చేస్తున్నట్లు తెలిపాయి. హనుక్కా పండుగ సందర్భంగా యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లను టార్గెట్‌గా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

News December 14, 2025

సర్పంచ్ రిజల్ట్స్: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా

image

TG: ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో BRS కంటే ఎక్కువ సీట్లు కమలం పార్టీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం విశేషం. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.

News December 14, 2025

సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య.. తీరా రిజల్ట్ చూస్తే..

image

TG: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మం. పీపడ్‌పల్లి సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) ఈ నెల 8న ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన ఆయన.. ప్రచారానికి డబ్బులు లేకపోవడం, పోటీకి ప్రోత్సహించిన వారు మౌనంగా ఉండటంతో అయ్యప్ప మాలలో ఉండగానే ఉరేసుకున్నాడు. అయితే ఇవాళ్టి ఫలితాల్లో రాజు 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో ఆ గ్రామంలో మరోసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.