News June 13, 2024

రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అమలు?

image

TG: రైతు రుణమాఫీకి పీఎం కిసాన్ స్కీమ్ నిబంధనలను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, IT చెల్లించేవారు తదితరులకు కేంద్రం పీఎం కిసాన్ అమలు చేయడం లేదు. దీంతో రుణమాఫీకి కూడా ఇవే మార్గదర్శకాలు అనుసరిస్తే అర్హులైన వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News November 16, 2025

వణికిస్తున్న చలి.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3-5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో APలోని అల్లూరి(D) అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. TGలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్‌లో 8.4, ఆదిలాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

News November 16, 2025

మత సామరస్యానికి ప్రతీక వావరు స్వామి గుడి

image

వావరు స్వామి అయ్యప్పకు అత్యంత ప్రీతిపాత్రుడైన ముస్లిం భక్తుడు. శబరిమల యాత్రలో, ఎరుమేలిలో ఉన్న వావరు స్వామి ఆలయం మత సామరస్యాన్ని చాటిచెప్పే గొప్ప కేంద్రంగా ఉంది. అయ్యప్ప భక్తులు మొదటగా ఆయనను దర్శించుకోవడం, పక్కనే ఉన్న పేటతుళసి ఆలయంతో ఈ ఆలయం ఉండటం.. హైందవ, ముస్లిం ఐక్యతకు ప్రతీక. వావరు స్వామి ఆలయ దర్శనం, దైవం ముందు అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. <<-se>>#AyyappaMala<<>>

News November 16, 2025

SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

image

TG: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ త్వరలో ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.