News September 29, 2024
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా పథకాల అమలు: మంత్రి నారాయణ

AP: ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం 9 లక్షల గృహాలు మంజూరు చేయడం దేశంలోనే రికార్డన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు YCP ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ CBN చాకచక్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 23, 2025
వారు ఆ టైంలోనే తిరుమలకు రావాలి: BR నాయుడు

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘DEC 30 నుంచి JAN 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నాం. 10 రోజులలో మొత్తం 182గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.
News December 23, 2025
ఉష్ణోగ్రత ఎంత ఉంటే.. చలి అంత ఉన్నట్టా?

ఉష్ణోగ్రత ఎంత తగ్గితే చలి తీవ్రత అంత ఎక్కువ అవుతుందనేది ఒకింత నిజమే. అయితే టెంపరేచర్ ఒక్కటే చలిని నిర్ణయించదు. వాతావరణంలోని తేమ, ఎండ.. ముఖ్యంగా గాలి వేగం ప్రభావితం చేస్తాయి. థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత కంటే గాలి వేగం ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి త్వరగా పోయి మరింత చల్లగా అనిపిస్తుంది. ఉదాహరణకు గాలి లేకుండా 0°C ఉంటే చల్లగా ఉంటుంది. అదే 0°Cకి 40kmph గాలి కలిస్తే -10°C లాగా అనిపిస్తుంది.
News December 23, 2025
ఢిల్లీ బాటలో ఒడిశా.. మరి మన దగ్గర!

పొల్యూషన్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలకే పెట్రోల్/డీజిల్ విక్రయించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన JAN 1 నుంచి అమలు కానుండగా, ఢిల్లీలో ఇప్పటికే పాటిస్తున్నారు. దేశ రాజధాని మాదిరి అధ్వాన వాయు కాలుష్య పరిస్థితులు రాకూడదంటే తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోనూ ఈ రూల్ తేవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముందుగానే మేల్కొంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్లు అవుతుందని సూచిస్తున్నారు.


