News September 29, 2024
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా పథకాల అమలు: మంత్రి నారాయణ

AP: ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం 9 లక్షల గృహాలు మంజూరు చేయడం దేశంలోనే రికార్డన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు YCP ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ CBN చాకచక్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 22, 2025
ఆస్తి పన్ను బకాయిలపై భారీ డిస్కౌంట్

TG: ఆస్తి పన్నుకు సంబంధించి HYD వాసులకు ప్రభుత్వం ‘వన్ టైం స్కీమ్’ (OTS) ప్రకటించింది. తాజాగా విడుదలైన G.O.Rt.No.869 ప్రకారం పాత బకాయిలపై ఉన్న వడ్డీలో 90% రద్దు చేస్తోంది. అసలు పన్ను మొత్తంతో పాటు కేవలం 10% వడ్డీని ఒకేసారి చెల్లిస్తే సరిపోతుంది. ప్రైవేట్ యజమానులకు, ప్రభుత్వ సంస్థలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 22, 2025
GHMC డీలిమిటేషన్పై పిటిషన్ల కొట్టివేత

TG: GHMC డీలిమిటేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల గ్రేటర్లో విలీనం చేసిన ప్రభుత్వం వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
News December 22, 2025
అమరావతిలో వరదనీటి ఎత్తిపోతకు మరో లిఫ్ట్

AP: వరద నీటిని ఎత్తిపోయడానికి ₹444Crతో మరో లిఫ్ట్ ప్రాజెక్టుకు CM CBN ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో CRDA ఆమోదం తెలిపింది. క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లో ₹103.96Crతో రీసెర్చ్ సెంటర్, LPS జోన్8లో ₹1358 కోట్లతో లేఅవుట్ల అభివృద్ధి, IAS క్వార్టర్లలో ₹109Crతో అదనపు సౌకర్యాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 202ఎకరాలు జరీబా లేదా మెట్టా తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కొండవీటి వాగుపై ఒక లిఫ్ట్ ఉంది.


