News September 29, 2024
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా పథకాల అమలు: మంత్రి నారాయణ

AP: ప్రపంచంలోని 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం 9 లక్షల గృహాలు మంజూరు చేయడం దేశంలోనే రికార్డన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకు YCP ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ CBN చాకచక్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
గిల్ ఎందుకు లేడు? క్లారిటీ ఇచ్చిన అగార్కర్

T20 WC టీమ్లో గిల్ లేకపోవడంపై చీఫ్ సెలక్టర్ అగార్కర్ స్పందించారు. రన్స్ విషయంలో కాస్త వెనకబడ్డప్పటికీ.. గిల్ క్వాలిటీ ప్లేయర్ అని అన్నారు. టీమ్ కాంబినేషన్లో భాగంగా టాప్ ఆర్డర్లో ఇద్దరు కీపర్లను తీసుకోవాల్సి రావడంతో గిల్కు చోటు దక్కలేదన్నారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి కాకుండా టీమ్ బ్యాలెన్స్కు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అటు కెప్టెన్ SKY సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
News December 20, 2025
నేను రేవంత్తో ఫుట్బాల్ ఆడుతా: KTR

TG: సీఎం రేవంత్ ఎవరితో ఫుట్బాల్ ఆడుతారో తనకు తెలియదని తాను మాత్రం రేవంత్ను ఫుట్బాల్ ఆడుకుంటానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రేవంత్లా నేను ఫ్యామిలీ విషయంలో చిల్లర రాజకీయాలు చేయను. కాంగ్రెస్ సర్కార్కు హనీమూన్ ముగిసింది. ఇక KCR ప్రజల్లోకి వస్తారు. రేవంత్ చెబుతున్న <<18605125>>66%<<>> విజయం నిజమైతే, ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికకు రావాలి’ అని చిట్ చాట్లో సవాల్ చేశారు.
News December 20, 2025
DMart ఫేక్ యాడ్.. ‘మహాభారత్’ నటుడి అకౌంట్ ఖాళీ!

మహాభారత్ సీరియల్లో ‘యుధిష్ఠిరుడు’ గజేంద్ర చౌహాన్ సైబర్ మోసానికి గురయ్యారు. FBలో DMart పేరుతో వచ్చిన ఫేక్ యాడ్ చూసి ఆయన డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. లింక్ నొక్కి OTP ఎంటర్ చేయగానే అకౌంట్ నుంచి ₹98,000 కట్ అయ్యాయి. ఆయన ఫిర్యాదుతో వెంటనే స్పందించిన ముంబై పోలీసులు డబ్బును రికవర్ చేశారు. ఆన్లైన్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.


