News January 29, 2025

దేశవ్యాప్తంగా UCC అమలు సాధ్యం కాదు: డీకే శివకుమార్

image

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి(UCC) అమలు అసాధ్యమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. భారత్‌లోని భిన్నత్వం కారణంగా అది కుదరదని కొట్టిపారేశారు. ‘ప్రతి పౌరుడికి తన వ్యక్తిగత జీవితం ఉంటుంది. మొత్తం దేశమంతటా అమలుచేసేందుకు కుదరని చట్టాన్ని రాష్ట్రంలో మాత్రం ఎలా అమలు చేస్తారు?’ అని ప్రశ్నించారు. UCC అమలైతే పౌరులందరికీ ఒకే పౌరస్మృతి అమల్లోకి వస్తుందన్న సంగతి తెలిసిందే.

Similar News

News November 27, 2025

రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే మృతి

image

రష్యాలో షాకింగ్ ఘటన జరిగింది. ఈటింగ్ ఛాలెంజ్ ద్వారా మొదట బరువు పెరిగి తర్వాత తగ్గే ప్రోగ్రామ్‌ను ప్రయత్నిస్తూ ఫిట్‌నెస్ కోచ్ డిమిత్రి నుయాన్జిన్(30) చనిపోయారు. ఆయన రోజుకు 10వేల క్యాలరీలకుపైగా జంక్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. డిమిత్రి ప్రయత్నం వికటించి ఒక నెలలోనే 13KGలు పెరిగి 103KGలకు చేరారు. చివరికి గుండెపోటుతో నిద్రలోనే మరణించారు. ఇలాంటి ఛాలెంజ్‌లను ఎవరూ అనుసరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News November 27, 2025

అమరావతిలో వేంకటేశ్వర ఆలయం రెండేళ్లలో పూర్తి: సీఎం

image

AP: దేవతల రాజధాని అమరావతి అని, మన రాజధానికి అమరావతి పేరు పెట్టే అవకాశం దేవుడు తనకిచ్చారని CM CBN చెప్పారు. కృష్ణా తీరంలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ‘ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ గుడికి ఉంది. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని TTDని కోరుతున్నా. ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతిఒక్కరికీ ఇవ్వాలని స్వామిని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News November 27, 2025

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ఒత్తిడి డేంజర్ అని తెలుసా?

image

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.