News March 16, 2024

దేశవ్యాప్తంగా ఇంటి నుంచి ఓటింగ్ అమలు

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలుకానుంది. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.

Similar News

News December 15, 2025

నేడు సర్వ ఏకాదశి.. మోక్షం కోసం ఏం చేయాలంటే?

image

మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశినే సర్వ ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించాలని పండితులు సూచిస్తున్నారు. తద్వారా మోక్షం లభిస్తుందని చెబుతున్నారు. ‘దానాలు చేయడం వల్ల ఆత్మ శుద్ధి జరుగుతుంది. చేసే పనుల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. తృణధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం పాటించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. వ్రతాలు ఆచరించడం మరింత శ్రేయస్కరం. మనస్ఫూర్తితో విష్ణుమూర్తిని ఆరాధిస్తే ముక్తి లభిస్తుంది’ అంటున్నారు.

News December 15, 2025

రెండో విడతలోనూ కాంగ్రెస్‌దే హవా

image

TG: రెండో విడత GP ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.

News December 15, 2025

కుంకుమ మన బలాన్ని పెంచుతుందా?

image

ఆలయాల ప్రాంగణంలో ప్రాణ శక్తికి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రసరిస్తూ ఉంటాయి. ఈ ప్రకంపనలను కొన్ని వస్తువులు మాత్రమే గ్రహించగలవు. అందులో ‘కుంకుమ’ కూడా ఒకటి. ఇది గుడి పరిసరాల్లో ప్రసరిస్తున్న ఆ గాలిలోని ప్రాణశక్తిని గ్రహించి మన శరీరానికి పంపుతుంది. తద్వారా మన శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది. మొత్తంగా కుంకుమ దేవాలయ సానుకూల శక్తిని మనలోకి తీసుకువస్తుంది.