News March 17, 2024

సుంకం లేకుండానే బంగారం దిగుమతి

image

బంగారం దిగుమతి విషయంలో ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దిగుమతి సుంకం చెల్లించకుండానే బంగారం దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారం దిగుమతిపై 15%సుంకం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం తాజాగా నిర్ణయంతో ఈ సుంకం భారం తగ్గనుంది.

Similar News

News December 26, 2025

ఇలా చేస్తే మానసిక ఆందోళన దూరం!

image

ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురై ఆరోగ్య సమస్యలు తెచ్చుకునేవారు కొన్నింటిని పాటిస్తే ప్రశాంత జీవితం సొంతమవుతుంది. ‘మైండ్‌ఫుల్ వాకింగ్ అంటే నడుస్తూ పాదాలు నేలను తాకుతున్న స్పర్శ, కాళ్ల కదలికలపై దృష్టి పెట్టాలి. ఇది వర్తమానంలో ఉంచుతుంది. తినేటప్పుడు టీవీ చూడకుండా రుచి, వాసనను ఆస్వాదించాలి. అలాగే హాయిగా కూర్చొని కళ్లు మూసుకొని శ్వాసను గమనిస్తే ఆందోళన దూరమవుతుంది’ అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

News December 26, 2025

బంగ్లాదేశ్ అందరిదీ: తారిఖ్ రెహమాన్

image

రాజకీయం, మతాలతో సంబంధం లేని బంగ్లాదేశ్‌ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని BNP తాత్కాలిక ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ అన్నారు. దేశ పౌరులు శాంతి కాంక్షించాలని కోరారు. ఇంటి నుంచి బయటికి వెళ్లినవారు సురక్షితంగా తిరిగి రాగల దేశాన్ని చూడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశం ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు సమానంగా చెందుతుందన్నారు. 17ఏళ్ల తర్వాత దేశంలో అడుగుపెట్టిన తారిఖ్ PM రేసులో ఉన్నారు.

News December 26, 2025

యశ్ దయాల్ స్థానంలో ఉమేశ్ యాదవ్?

image

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB బౌలర్ యశ్ దయాల్ స్థానంలో IND సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్‌లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని RCBపై విమర్శలొస్తున్నాయి. తాజాగా అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో ఉమేశ్‌ను తీసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై RCB నుంచి అధికారిక ప్రకటన రాలేదు.