News November 13, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.
Similar News
News January 31, 2026
వారికి 2 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవులు

AP: ఫిబ్రవరి 5న ఏపీజేఏసీ రాష్ట్ర మహాసభ కోసం విజయవాడకు వచ్చే ఉద్యోగులకు ప్రభుత్వం రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. 4, 5వ తేదీల్లో సెలవు ఉండనుంది. సభ కోసం రాష్ట్రంలోని 90 డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఏపీజేఏసీ ఛైర్మన్ బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేసింది.
News January 31, 2026
రేపు పాక్తో మ్యాచ్.. యువ ఆటగాళ్లకు సచిన్ పాఠాలు!

U19 WCలో భాగంగా రేపు పాక్తో సూపర్-6లో యువ భారత్ తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్లో ఎదురైన <<18632613>>ఓటమి<<>>కి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లతో క్రికెట్ లెజెండ్ సచిన్ వర్చువల్గా మాట్లాడారు. వారికి ఇది అమూల్యమైన అనుభవమని, ముఖ్యమైన అంశాలపై సచిన్ అవగాహన కల్పించారని BCCI తెలిపింది. సూపర్-6 తొలి మ్యాచ్లో జింబాబ్వేపై 204 పరుగుల తేడాతో IND గెలిచింది.
News January 31, 2026
ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ పేరు.. తీవ్రంగా ఖండించిన భారత్

అమెరికా ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎప్స్టీన్ ఫైల్స్లో PM మోదీ పేరు ఉండటాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. 2017లో ఇజ్రాయెల్ పర్యటనకు మోదీ వెళ్లారన్న విషయం తప్ప మిగతావన్నీ అబద్ధాలేనని కొట్టిపారేసింది. దోషిగా తేలిన నేరస్థుడి చెత్త పుకార్లని MEA ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మండిపడ్డారు. మోదీ తన సలహా తీసుకున్నారని ఎప్స్టీన్ చెప్పినట్లు ఆ డాక్యుమెంట్లలో ఉంది. పలు వివాదాస్పద అంశాలనూ ఈమెయిల్లో పేర్కొన్నారు.


