News November 13, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.

Similar News

News January 26, 2026

తిరుమలలో వైభవంగా రథ సప్తమి

image

AP: తిరుమల కొండపై రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవ కొనసాగుతుండగా చిరు జల్లులు, వెలుగుల మధ్య ఏడుకొండలవాడు అద్వితీయంగా కనువిందు చేశారు. భక్తులు స్వామిని స్మరిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

News January 26, 2026

రేపు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన

image

దేశవ్యాప్తంగా రేపు నిరసన చేపట్టనున్నట్లు గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. గిగ్ వర్కర్లను అధికారిక కార్మికులుగా గుర్తించడంతో పాటు సెంట్రల్ గిగ్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఆదాయ భద్రత లేకపోవడం, అకారణంగా ఐడీలు బ్లాక్ చేయడం, పారదర్శకత లేని రేటింగ్ వ్యవస్థలపై ఆందోళన వ్యక్తం చేసింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చింది.

News January 25, 2026

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్ స‌న్మానం

image

TG: పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు CM రేవంత్ రెడ్డి సన్మానం నిర్వహించనున్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ లభించగా, పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం తిరిగి వచ్చిన అనంతరం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గతేడాది కూడా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు.