News November 13, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.
Similar News
News January 23, 2026
ట్రంప్ కంటే మోదీ పవర్ఫుల్: ఇయాన్ బ్రెమ్మర్

US అధ్యక్షుడు ట్రంప్ కంటే మన PM మోదీయే చాలా పవర్ఫుల్ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ పదవి మరో మూడేళ్లలో పోతుందని.. కానీ మోదీకి దేశంలో తిరుగులేని మద్దతు ఉందని పేర్కొన్నారు. దీంతో మోదీ సంస్కరణలను దూకుడుగా అమలు చేయగలరని, విదేశీ ఒత్తిడి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరని విశ్లేషించారు. ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా బెటర్ పొజిషన్లో ఉన్నట్లు తెలిపారు.
News January 23, 2026
ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్లు.. బుమ్రా మ్యాజిక్ ఇదే!

బుల్లెట్ల లాంటి యార్కర్లతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే భారత స్టార్ బౌలర్ బుమ్రా ఇంటర్నేషనల్ క్రికెట్లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తన డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్ వల్ల ఎక్కువ రోజులు ఆడలేరన్న విమర్శకుల నోళ్లు మూయించారు. ఈ పదేళ్లలో టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 103W తీశారు. 2024లో ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా నిలిచారు. రానున్న T20 WCలో IND బౌలింగ్ దళాన్ని బుమ్రానే నడిపించనున్నారు.
News January 23, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.


