News August 31, 2024
స్కూళ్లకు సెలవులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వెంటనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని CS శాంతికుమారి సూచించారు. ‘స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. డ్యామ్లు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు మాకు చేరవేయాలి’ అని ఆదేశించారు.
Similar News
News March 6, 2026
కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 6, 2026
తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 6, 2026
పెట్రోల్ ధరలు పెరుగుతాయా?.. కేంద్ర వర్గాలు ఏం చెప్పాయంటే..

దేశంలో పెట్రోల్ ధరలు పెరగవని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ‘రష్యా నుంచి క్రూడాయిల్ను కొనుగోలు చేస్తున్నాం. ముడి చమురు విషయంలో పరిస్థితి అదుపులోనే ఉంది. దేశీయ మార్కెట్లలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవు’ అని వివరించాయి. హార్ముజ్ జలసంధి గుండా గ్యాస్, ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా తగినంత మేర రిజర్వులు ఉన్నాయని వెల్లడించాయి.


