News August 31, 2024
స్కూళ్లకు సెలవులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణలో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో వెంటనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని CS శాంతికుమారి సూచించారు. ‘స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. డ్యామ్లు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు మాకు చేరవేయాలి’ అని ఆదేశించారు.
Similar News
News March 2, 2026
ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్

AP: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు.
News March 2, 2026
అరామ్కోపై ఇరాన్ దాడి.. ప్రభావమెంత?

సౌదీ <<19278592>>అరామ్కో<<>>కు చెందిన రాస్ తనూరా రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి, ఎగుమతి కేంద్రం. ఇక్కడ రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. 3.3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వ చేసే వసతులు ఉన్నాయి. అత్యాధునిక లోడింగ్ బెర్తులు, పైప్లైన్ నెట్వర్క్తో కూడిన ఈ పోర్ట్ ద్వారా గ్లోబల్ ఆయిల్ డిమాండ్లో దాదాపు 7% ఎగుమతులు జరుగుతాయి. దీంతో ఆయిల్ ధరలు భారీగా పెరిగే ఆస్కారముంది.
News March 2, 2026
కుసుమ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాసంగి పంటగా విత్తుకున్న కుసుమ.. నాటిన సమయాన్ని బట్టి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల ఇది కోత దశలో ఉంది. అయితే ఈ కుసుమ పంటను ఉదయాన్నే కోయడం వల్ల గింజలు రాలడం తక్కువగా ఉండటమే కాకుండా ముల్లు మొత్తగా ఉండి కోత ప్రక్రియ ఈజీగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట కోత తర్వాత గింజలలో తేమ 5 నుంచి 8 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టాలి. దీని వల్ల గింజ నాణ్యత బాగుంటుందని తెలిపారు.


