News June 26, 2024
పరువు నష్టం కేసులో రాహుల్కు కీలక ఆదేశాలు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జులై 2న కోర్టుకు హాజరుకావాలని యూపీలోని సుల్తాన్పూర్ జిల్లాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తాను చేసిన ఆరోపణలపై దాఖలైన పరువునష్టం కేసుకు సంబంధించి స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు రావాలని రాహుల్కు సూచించింది. బెంగళూరులో ఓ విలేకరుల సమావేశంలో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై 2018 ఆగస్టు 4న కేసు నమోదైంది.
Similar News
News December 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 28, 2025
నా ప్రాణానికి ముప్పు: MLC దువ్వాడ

AP: తన ప్రాణానికి <<18684111>>ముప్పు<<>> ఉందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం SPని కలిసి ఫిర్యాదు చేశారు. 2+2 గన్మెన్లను కేటాయించాలని కోరారు. కొద్ది రోజులుగా తనకు ఫోన్లో, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని అణచివేయాలనే ధోరణి సరికాదని మీడియాతో అన్నారు.
News December 28, 2025
ఉజ్జయిని ఆలయానికి రూ.100 కోట్ల విరాళాలు

MPలోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి ఈ ఏడాది ₹107.93 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఇందులో ₹13 కోట్ల విలువైన బంగారం ఉండటం గమనార్హం. ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 5.5 కోట్ల మంది ఆలయాన్ని దర్శించుకున్నారు. సగటున రోజూ 1.5L-2L మంది వస్తున్నారు. సెలవుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, క్రిస్మస్ రోజున 2.5 లక్షల మంది దర్శనానికి వచ్చారని ఆలయ కమిటీ తెలిపింది. న్యూఇయర్ దాకా మరో 6 లక్షల మంది వస్తారని చెప్పింది.


