News June 26, 2024

పరువు నష్టం కేసులో రాహుల్‌కు కీలక ఆదేశాలు

image

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జులై 2న కోర్టుకు హాజరుకావాలని యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తాను చేసిన ఆరోపణలపై దాఖలైన పరువునష్టం కేసుకు సంబంధించి స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు రావాలని రాహుల్‌కు సూచించింది. బెంగళూరులో ఓ విలేకరుల సమావేశంలో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై 2018 ఆగస్టు 4న కేసు నమోదైంది.

Similar News

News December 21, 2025

BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఢిల్లీలోని డాక్టర్ <>BR<<>> అంబేడ్కర్ యూనివర్సిటీ 71 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 16వరకు పంపవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, PhD/M.Phil, NET, SLAT, SET, M.Ed, M.LSc ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ప్రజెంటేషన్/సెమినార్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aud.delhi.gov.in

News December 21, 2025

514 పోస్టులు.. అప్లికేషన్ల స్వీకరణ మొదలు

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఆన్‌లైన్‌లో 2026 జనవరి 5వ తేదీ వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత డిగ్రీ, పోస్టులను బట్టి వయస్సు: 25-40 పరిమితి ఉంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా (70:30) ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు BOI అధికారిక సైట్ చూడండి.

News December 21, 2025

దూసుకెళ్తున్న మహాయుతి

image

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. 246 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు, 42 నగర పంచాయతీల్లో బీజేపీ 116+, శివసేన 50+, ఎన్సీపీ 34+ చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. శివసేన యూబీటీ 12, ఎన్సీపీ(SP) 12, కాంగ్రెస్ 28+ స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.