News November 28, 2024
మహారాష్ట్ర CM ఎంపికపై నేడు కీలక భేటీ

మహారాష్ట్ర CM ఎవరనే ప్రశ్నకు నేడు సమాధానం దొరికే అవకాశముంది. ఢిల్లీలో BJP అగ్రనేతలతో ఫడణవీస్, శిండే, అజిత్ పవార్ భేటీ కానున్నారు. CM ఎవరన్నది ‘మహాయుతి’ నేతలు ఈ మీటింగ్లో ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. CM, ఇద్దరు dy.CMలు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఎక్కువ శాతం BJPనే పదవి వరించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 23న ఎన్నికల ఫలితాలు రాగా, 5 రోజులుగా సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
Similar News
News November 28, 2025
వైకుంఠద్వార దర్శనాలు.. తొలి రోజే 4.60L మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఆన్లైన్లో పేర్ల నమోదుకు విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 30, 31, జనవరి 1న దర్శనాల కోసం నిన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రానికే 4.60L మంది నమోదుచేసుకున్నారు. DEC 1 వరకు ttdevasthanams.ap.gov.in, TTD యాప్, 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు DEC 2న మెసేజ్లు పంపుతారు.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: టికెట్లు ఇలా బుక్ చేయండి

TTD అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి మొదటి 3 రోజులకు (DEC 31, 31, JAN 1) టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ నంబర్ 9552300009కి HI లేదా GOVINDA అని మెసేజ్ చేసి, వివరాలు ఇవ్వడం ద్వారా కూడా టికెట్లు బుక్ అవుతాయి. ఒక నంబర్తో గరిష్ఠంగా నలుగురికి బుక్ చేసుకోవచ్చు. DEC 1 వరకు ఛాన్సుంది. ఆ తర్వాత టికెట్లను లక్కీ డిప్ తీస్తారు. ఎంపికైన వారికి మొదటి 3 రోజుల్లో ఉచిత దర్శన భాగ్యం దక్కుతుంది.
News November 28, 2025
మరోసారి మెగా పీటీఎం

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.


