News June 29, 2024
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్య గమనిక

AP: పెన్షన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎస్ నీరభ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. జులై 1న ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. అవసరమైతే రెండో రోజూ కొనసాగించాలని చెప్పారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్, ఆర్బీఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే నగదు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం లబ్ధిదారుడి సంతకం/వేలిముద్ర తీసుకుని పింఛన్ అందించినట్లు రసీదు ఇవ్వాలని సూచించారు.
Similar News
News November 15, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(<
News November 15, 2025
బహిరంగ ప్రకటన లేకుండా గిఫ్ట్ డీడ్.. పరకామణిలో చోరీపై సీఐడీ

AP: పరకామణిలో చోరీ కేసులో నిందితుడు రవికుమార్ టీటీడీకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్పై బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వలేదని జేఈవో వీరబ్రహ్మంను సీఐడీ ప్రశ్నించింది. టీటీడీకి రూ.14.43 కోట్ల విలువైన ఆస్తులను నిందితుడు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. ఇష్టప్రకారమే ఇచ్చారా? ఒత్తిడి చేశారా అని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకున్నప్పుడు ఎన్ని నోట్లు దొరికాయి, ఆరోజు లెక్కింపునకు వచ్చిన భక్తుల వివరాలు సేకరిస్తున్నారు.
News November 15, 2025
స్వామి పుష్కరిణి అని పేరెందుకు వచ్చింది?

తిరుమలలోని స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడానికి ఓ పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. వేంకటాచలంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలన్నింటికీ ఈ పుష్కరిణియే అవతార స్థానం. లోకంలోని తీర్థాలన్నింటిలోనూ దీన్ని స్వామి వంటిదిగా పరిగణిస్తారు. వరాహ, వామన పురాణాల ప్రకారం.. తనలో స్నానం చేసిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదించగల శక్తి, పవిత్రతను అందిస్తుందట. అందుకే దీనికి స్వామి పుష్కరిణి అనే పేరు స్థిరపడింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


