News July 27, 2024
పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఏపీలో ఆగస్టు నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గత నెల మాదిరి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు. 1వ తేదీనే 99% పూర్తి చేయాలని, ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించాలని సెర్ప్ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. పలు కారణాలతో పంపిణీ చేయలేని వారికి మరుసటి రోజు అందించాలన్నారు. ఈ మేరకు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 31నే బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


