News June 20, 2024
EVMలను హ్యాక్ చేయడం అసాధ్యం: IIT డైరెక్టర్

ఇండియాలో వినియోగిస్తున్న M3 మోడల్ ఈవీఎంలను హ్యాక్ చేయడం, ట్యాంపర్ చేయడం అసాధ్యమని ఐఐటీ గాంధీనగర్ డైరెక్టర్ రజత్ స్పష్టం చేశారు. ‘EVMలకు ఇతర పరికరాలతో కనెక్షన్ ఉండదు. వీటిని ఇంటర్నెట్, బ్లూటూత్ లాంటి వాటితో లింక్ చేయడం సాధ్యం కాదు. తద్వారా ఇతర సాఫ్ట్వేర్, ప్రోగ్రామ్స్ లోడ్ చేయలేం. ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే అందులోని ఆటోమేటెడ్ ఫంక్షన్లు దీన్ని వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేస్తాయి’ అని వివరించారు.
Similar News
News January 2, 2026
వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 2, 2026
పేదల కోసం నిలబడకుండా వెళ్లిపోయారు: భట్టి

TG: ఉపాధి హామీ పథకంపై సభలో మాట్లాడకుండా BRS నేతలు వెళ్లిపోవడం విచారకరమని Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘కోట్లాది మంది నిరుపేదల కోసం BRS అలియాస్ TRS నేతలు మాట్లాడాల్సింది. కానీ, వాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను వదిలేశారు. ఈ చట్టాన్ని మార్చకూడదని, పాతదే కొనసాగించాలని చాలా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మనమూ అలాంటి తీర్మానం చేసి పేదల పక్షాన నిలబడదాం’ అని విజ్ఞప్తి చేశారు.
News January 2, 2026
‘ఉపాధి’కి గాంధీ పేరు కొనసాగించాలంటూ సభలో తీర్మానం

TG: ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే కొత్తగా తెచ్చిన రూల్స్ వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతోందన్నారు. ఉపాధి పనులకు గతంలో కేంద్రమే 100% నిధులు కేటాయించేదని, ఇప్పుడు 60-40 శాతానికి మార్చడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.


