News April 4, 2024
1962లోనే 38వేల చ.కి.మీ భూమిని కోల్పోయాం: జైశంకర్

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందని ఇండియా కూటమి చేస్తోన్న విమర్శలను విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. 1962లోనే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయామని చెప్పారు. 2000 తర్వాత ఆక్రమణ జరిగిందని ఆరోపించడం సరి కాదన్నారు. పాక్, చైనాను మినహాయిస్తే మిగతా పొరుగుదేశాలతో భారత సంబంధాలు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయని తెలిపారు. POK ఎప్పటికీ భారత్లో భాగమేనని స్పష్టం చేశారు.
Similar News
News January 2, 2026
మున్సిపల్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్.. పేరు చెక్ చేసుకోండి

తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలు రిలీజ్ అయ్యాయి. ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది జాబితా విడుదల చేయనున్నారు. మొత్తం 45 లక్షల మందిపైగా ఓటర్లు ఉన్నారు. అందులో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు ఉన్నారు. మున్సిపాలిటీల్లో 2,690, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నాయి. https://tsec.gov.inలో పేరు చెక్ చేసుకోవచ్చు.
News January 2, 2026
చిక్కటి రక్తం నాకు ఇష్టం ఉండదు: ట్రంప్

డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన దానికన్నా ఎక్కువ డోసులో ఆస్పిరిన్ మాత్రలు వేసుకుంటున్నానని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘రక్తాన్ని పలుచగా చేసేందుకు ఆస్పిరిన్ బాగా పని చేస్తుందని డాక్టర్లు చెప్పారు. చిక్కటి రక్తం నా గుండె ద్వారా ప్రవహించడం నాకు ఇష్టం ఉండదు. పలుచని రక్తమే వెళ్లాలని కోరుకుంటా. అందుకే ఆస్పిరిన్ డోసులు ఎక్కువ వేసుకుంటున్నా. దీనివల్లే నా చేతిపై గాయాలు అవుతున్నాయి’ అని తెలిపారు.
News January 2, 2026
నాభి రహస్యం – ఆరోగ్యానికి మూలం

విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించడం సృష్టికి మూలం నాభి అని సూచిస్తుంది. తల్లి గర్భంలో శిశువుకు నాభి ద్వారానే జీవం అందుతుంది. మన శరీరంలోని 72 వేల నరాలు నాభి వద్దే అనుసంధానమై ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం నాభికి నూనె రాస్తే జీర్ణక్రియతో పాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేసి, సహజంగా రోగాలను నయం చేసే అద్భుతమైన ప్రక్రియ.


