News June 4, 2024
కాసేపట్లో ప్రజాతీర్పు

AP ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఉ.8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, 8.30 గంటలకు EVMల కౌంటింగ్ షురూ కానుంది. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో(MLA) తొలి ఫలితం వెలువడనుంది. భీమిలి, పాణ్యం ఫలితం చివరిగా రానుంది. రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో తొలి ఫలితం రానుండగా.. అమలాపురం ఫలితం ఆలస్యం కానుంది. EVM కౌంటింగ్కు ఒక్కో రౌండ్కు 20-25 నిమిషాలు పట్టనుండగా మ.1 కల్లా మెజార్టీ ఎవరిదో తేలనుంది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


