News April 6, 2024
వైసీపీలో చేరిన అమలాపురం జనసేన ఇన్ఛార్జ్

AP: జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేసిన రాజాబాబు 45 వేలకు పైగా ఓట్లను సాధించారు. ఈసారి పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి ఇవ్వడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
Similar News
News January 26, 2026
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా ఎదగడమే లక్ష్యం: జిష్ణుదేవ్ వర్మ

TG: అభివృద్ధిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికశక్తిగా TG ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వికసిత్ భారత్కు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నట్లు రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రసంగించారు. క్యూర్, ప్యూర్, రేర్ విధానాలతో ముందుకెళ్తోందని తెలిపారు. ఈ ప్రభుత్వం విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుందన్నారు.
News January 26, 2026
RITES లిమిటెడ్లో 18 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

RITES లిమిటెడ్లో 18 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.40,000-రూ.2,80,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PwBD, EWSలకు రూ.300. వెబ్సైట్: rites.com/
News January 26, 2026
బాలీవుడ్పై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు

బాలీవుడ్ ప్లాస్టిక్ విగ్రహాల మ్యూజియంగా మారిందని నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇండస్ట్రీకి, ఆడియన్స్కు మధ్య సంబంధం తగ్గిపోతోందని అన్నారు. హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయన్నారు. చూడటానికి అందంగా, అద్భుతంగా ఉన్నప్పటికీ మ్యూజియంలోని విగ్రహాల్లా ఉన్నాయని ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో పేర్కొన్నారు. తమిళ్, మలయాళ చిత్రాలు కంటెంట్ పరంగా క్రియేటివ్గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.


