News September 1, 2024

ఆ విషయంలో విపక్షాలది రాజకీయం: ఫడ్నవీస్

image

ఛ‌త్ర‌ప‌తి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘ‌ట‌న‌పై నిర‌స‌న పేరుతో విప‌క్ష మ‌హావికాస్ అఘాడీ రాజ‌కీయం చేస్తున్నాయ‌ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శించారు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో శివాజీని నెహ్రూ అవ‌మానించారని, దీనికి కాంగ్రెస్ క్ష‌మాప‌ణ‌లు చెబుతుందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మధ్యప్రదేశ్‌లో గత క‌మ‌ల‌నాథ్ స‌ర్కార్ బుల్డోజ‌ర్ల‌తో శివాజీ విగ్ర‌హాన్ని కూల్చిందని దుయ్య‌బ‌ట్టారు.

Similar News

News October 21, 2025

ఏపీ, టీజీ న్యూస్ రౌండప్

image

* మిగతా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి: TG సీఎం రేవంత్
* నవంబర్ 7న ఏపీ క్యాబినెట్ భేటీ
* ఖైరతాబాద్, శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాలను సందర్శించిన కేటీఆర్, హరీశ్ రావు
* నారా నరకాసుర పాలన పోవాలి.. జగనన్న పాలన రావాలి: రోజా
* హైదరాబాద్‌లో బాణసంచా కాలుస్తూ 70 మందికి గాయాలు

News October 21, 2025

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

AP: NTR జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/

News October 21, 2025

ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

image

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్‌చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.