News September 19, 2024

ఆ విష‌యంలో మాది కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రే: పాక్‌ మంత్రి

image

JKలో ఆర్టికల్ 370 పున‌రుద్ధ‌ర‌ణ విష‌యంలో తాము కూడా కాంగ్రెస్‌-ఎన్సీ వైఖ‌రితోనే ఉన్నామంటూ పాక్ రక్ష‌ణ మంత్రి ఖ‌వాజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. JKలో కూట‌మి గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆర్టిక‌ల్ 370, 35A పున‌రుద్ధ‌ర‌ణ‌లో వారిది, తమది ఒకే వైఖ‌రి అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ ఎక్క‌డా ఆర్టిక‌ల్ 370 పున‌రుద్ధ‌రిస్తామ‌ని చెప్ప‌లేదు. NC మాత్రం అమలు చేస్తామంటూ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తుండడం గమనార్హం.

Similar News

News September 11, 2025

4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

image

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్‌లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

News September 11, 2025

ఏ వాస్తు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి?

image

వాస్తు శాస్త్రంపై ఏ ఒక్క రుషి రచనను ప్రామాణికంగా తీసుకోవాలన్న సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనం వేర్వేరు మార్గాల్లో వెళ్లినా చేరాల్సిన గమ్యం ఒక్కటే అయినట్లుగా.. ఏ వాస్తు శాస్త్రాన్ని అనుసరించినా దాని లక్ష్యం ఒకటే ఉంటుంది. అందరు మహర్షులు సమాజ హితం కోసమే ఈ రచనలు చేశారు. మీరు ఏ వాస్తు శాస్త్రాన్ని ఎంచుకున్నా అందులో సూత్రాలు మారవు. బాగా ప్రాచుర్యం పొందిన వాస్తు శాస్త్రాన్ని ఎంచుకోవడం మంచిది.

News September 11, 2025

వాస్తు శాస్త్రాన్ని అంత మంది రుషులు ఎందుకు రచించారు?

image

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఓ వ్యక్తి ఆలోచన మాత్రమే కాదు. ఇది అనేకమంది రుషుల జ్ఞానం, అనుభవం నుంచి పుట్టింది. ఇతిహాసాలు, పురాణాలను ఎంతో మంది కవులు, పండితులు తమదైన శైలిలో రచించినట్లే వాస్తు శాస్త్రాన్ని కూడా ఎందరో మహర్షులు సమాజ శ్రేయస్సు కోసం రాశారు. వారి రచనల్లో పదాలు వేరుగా ఉన్నప్పటికీ, పరమార్థం ఒకటే ఉంటుంది. వీళ్లందరూ మానవుల జీవితం సుఖశాంతులతో సాగడానికి సరైన మార్గాన్ని చూపించారు.