News October 3, 2024
ఆ విషయంలో గాంధీ తరువాత మోదీనే: అమిత్ షా

గుజరాత్కు చెందిన ఇద్దరు పుత్రులు మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ మాత్రమే దేశ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత పౌరుల ఆరోగ్యం, ఆయుర్దాయం గురించి ఆందోళన చెందుతూ పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ఎర్రకోట నుంచి మోదీ విజ్ఞప్తి చేశారన్నారు. గాంధీ తర్వాత పరిశుభ్రత ప్రాథమిక అవసరాన్ని వివరించిన 2వ జాతీయ నాయకుడు మోదీ అని పేర్కొన్నారు.
Similar News
News July 4, 2025
పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దు: రేవంత్

TG: రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం అని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘కేంద్రం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా చేశాం. ఎవరూ పార్టీ పదవులను క్యాజువల్గా తీసుకోవద్దు. వాటితోనే గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. కొత్త నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. కష్టపడి మళ్లీ INCని అధికారంలోకి తేవాలి’ అని TPCC కార్యవర్గ సమావేశంలో పేర్కొన్నారు.
News July 4, 2025
పొంగులేటి పేపర్ యాడ్పై కాంగ్రెస్లో చర్చ

TG: మల్లిఖార్జున ఖర్గే పర్యటనపై మంత్రి పొంగులేటి ఇచ్చిన పేపర్ ప్రకటనలతో ఆ పార్టీలో కొత్త కలకలం రేగింది. పలు పేపర్లకు రెవెన్యూ మంత్రి ఇచ్చిన యాడ్లలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫొటో లేదు. ఇటీవల ఆయనను మీనాక్షి మందలించినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఫొటో లేకపోవడానికి కారణమదే అయ్యుండొచ్చని వినిపిస్తోంది. ఇదే సమయంలో మరో మంత్రి వివేక్ యాడ్లలో పార్టీ ఇన్ఛార్జ్ ఫొటో ఉంది(Slide:2).
News July 4, 2025
ఈ ఇన్నింగ్స్ గిల్కు ఎంతో స్పెషల్.. నెట్టింట చర్చ

ఇంగ్లండ్పై రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులు చేసి ఔరా అనిపించారు. అయితే, ఈ ఘనతను రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నంబర్తో పోల్చుతూ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ క్యాప్ నంబర్ 269 కావడంతో ఈ ఇన్నింగ్స్ గిల్కు ఎంతో స్పెషల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కోహ్లీ తనకు ఆదర్శమని, ఆయనలా రాణించాలని కోరుకుంటున్నట్లు గిల్ చెప్పుకొచ్చారు.