News August 15, 2024
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ రూ.వేల కోట్ల దోపిడీ: రేవంత్

TG: కేసీఆర్, హరీశ్ రావు గతంలో అన్నీ బోగస్ మాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కొత్తగూడెంలోని పూసుగూడెంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ రూ.వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని దుయ్యబట్టారు. తాము ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
Similar News
News July 8, 2025
అడ్వాన్స్డ్ ఫీచర్లతో GROK 4.. జులై 8న రిలీజ్

xAI ఆవిష్కరించిన AI చాట్ బాట్ GROKలో కొత్త వర్షన్ రాబోతోంది. GROK 4 కొత్త రిలీజ్ డేట్ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. జులై 4న జరగాల్సిన ఈ రిలీజ్ బుధవారం(జులై9)కి వాయిదా పడింది. రా.8 గంటలకు రిలీజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది ఓ స్పెషలైజ్డ్ కోడింగ్ మోడల్. డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటుంది. రియల్టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.
News July 8, 2025
మెగా DSCపై తప్పుడు ప్రచారాలు: విద్యాశాఖ

AP: మెగా DSC అభ్యర్థులు పరీక్షలపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ‘కొన్ని పత్రికలు, SMలో పరీక్షలపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. సాఫ్టవేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు ధ్రువీకరణ కాలేదు. అధికారిక సమాచారంలేని ప్రచారాలు నమ్మొద్దు. అభ్యర్థుల సహాయం కోసం 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొంది.
News July 8, 2025
నేరాల నిరూపణకు టెక్నాలజీ వాడాలి: చంద్రబాబు

AP: RTGS రివ్యూలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల నిరూపణకు టెక్నాలజీని వినియోగించాలి. కొందరు తెలివిగా నేరాలు చేసి ప్రభుత్వంపై నెపం వేస్తున్నారు. పోలీసులకు సహకరించని వారి విషయంలో అలర్ట్గా ఉండాలి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారి నుంచి డేటా సేకరణకు చర్యలు చేపట్టాలి. నేరం చేసిన వారిని బాధ్యులను చేసే అంశంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.