News March 25, 2024
సీమలో రెండు చోట్లే..
AP: వచ్చే ఎన్నికల్లో జనసేన 21 చోట్ల పోటీ చేస్తోంది. ఇందులో సింహభాగం సీట్లు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే ఉన్నాయి. రాయలసీమలో తిరుపతి, రైల్వే కోడూరు స్థానాల్లోనే బరిలోకి దిగుతోంది. 2009లో తిరుపతిలో చిరంజీవి నెగ్గారు. 2019లో జనసేన నేత చదలవాడ కృష్ణమూర్తికి 12,315 ఓట్లే పోలయ్యాయి. రైల్వేకోడూరులో గతంలో PRP అభ్యర్థికి 22వేల చిలుకు ఓట్లు రాగా.. 2019లో జనసేన క్యాండెట్కు 9,964 ఓట్లే వచ్చాయి.
Similar News
News October 3, 2024
విరాట్ ఓ గొప్ప ఆటగాడు: హర్భజన్
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ దాదా ప్లేయర్ అని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసించారు. ‘విరాట్ ఓ గొప్ప ఆటగాడు. మెగా టోర్నీలు, ఫైనల్స్లో ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. గత టీ20 వరల్డ్ కప్లో కూడా మంచి ప్రదర్శనే చేశారు. టీ20 ఫార్మాట్లో ఆయనకు పరుగులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
News October 3, 2024
వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.
News October 3, 2024
మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్: కేటీఆర్
TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టింది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘నమామి గంగ ప్రాజెక్టుకు ఒక్కో కి.మీకు రూ.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ మూసీ సుందరీకరణకు ఒక్కో కి.మీకు రూ.2,700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదెక్కడి వింత? ఈ స్కామ్ నిధులు మొత్తం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులోకే వెళ్తున్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.